ఇంటికి చేరకుండానే దూరమైపోయారు
దైవదర్శనం చేసుకుని వస్తున్న నలుగురు అయ్యప్ప స్వాములను రహదారి ప్రమాదం బలిగొనడంతో నీలిపూడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదంలో నలుగురు దుర్మరణం
నీలిపూడిలో విషాదఛాయలు
బాపట్ల జిల్లా జంపని వద్ద బోల్తాపడిన వాహనం
కృత్తివెన్ను(కృష్ణా), న్యూస్టుడే: దైవదర్శనం చేసుకుని వస్తున్న నలుగురు అయ్యప్ప స్వాములను రహదారి ప్రమాదం బలిగొనడంతో నీలిపూడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గంటల వ్యవధిలోనే ఇళ్లకు వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు తమ వారి దుర్మరణ వార్త విని కుప్పకూలిపోయారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలకు చెందిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పవన్కుమార్ రమేష్ పాండురంగారావు రాంబాబు
తల్లడిల్లుతున్న కుటుంబ సభ్యులు
మృతుల్లో బుద్దన పవన్కుమార్ ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. తల్లిదండ్రులతో పాటు సోదరి, సోదరుని బాధ్యతలు చూసుకోవాల్సిన అతను ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తమ కష్టాలు త్వరలో తీరతాయని భావిస్తున్న సమయంలో విధి చిన్నచూపు చూసి, ఇంటికి ఆసరాగా ఉండాల్సిన వాడిని దూరం చేసిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కడవరకూ అండగా ఉండాల్సిన భర్త తనను ఒంటరిని చేసి అర్ధంతరంగా దూరం కావడాన్ని బాడిత రమేష్ భార్య జీర్ణించుకోలేక పోతోంది.
సోదరుడి కళ్లెదుటే
బొలిశెట్టి పాండురంగారావుతో పాటు అతని సోదరుడు చంటి కూడా అదే వాహనంలో ఉన్నారు. తన కళ్లెదుటే అన్న పాండురంగారావు విగతజీవిగా మారడాన్ని చూసి చంటి తట్టుకోలేకపోతున్నాడు. ఈ ప్రమాదంలో అతను కూడా గాయపడ్డాడు. పాండురంగారావుకు పాప, బాబు ఉన్నారు.
* కౌలురైతు పాశం రాంబాబు ప్రమాదంలో మృత్యువాతపడడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారికి వివాహాలయ్యాయి.
పలువురి పరామర్శ
మంత్రి జోగి రమేష్, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్, పెడన నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్, ఎంపీపీ ప్రసాద్, ఆయా పక్షాలకు చెందిన స్థానిక నాయకులు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను సంతాపం తెలిపారు.
మలుపు... మంచు ప్రాణాలు తీశాయా?
వేమూరు, న్యూస్టుడే: వారంతా అయిదు రోజుల పాటు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. శబరిమల వెళ్లి అయ్యప్ప దీక్ష ముగించుకుని వచ్చి శబరి ఎక్స్ప్రెస్లో తెనాలి చేరి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. మృత్యువు మంచు, మూల మలుపు రూపంలో వచ్చి నలుగురిని కబళించింది.
ప్రయాణం మొదలైన గంటలోపే.. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం, నూలిపూడికి చెందిన 23మంది అయ్యప్ప దీక్షాధారులు శబరిమల వెళ్లేందుకు తమ గ్రామం నుంచి తెనాలి రైల్వేస్టేషన్కు చేరుకున్న వాహనాన్నే తిరుగు ప్రయాణానికి కూడా మాట్లాడుకున్నారు. సోమవారం ఉదయం పొగమంచు దట్టంగా అలముకొని ఉండడం, జంపని చివుకులవారి చెరువు వద్ద మూలమలుపును గుర్తించలేక చోదకుడు వాహనాన్ని కుడివైపునకు తిప్పే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న పోలీసులు ఏర్పాటు చేసిన ప్రమాద హెచ్చరిక బోర్డును ఢీకొని బోల్తాపడింది. ప్రయాణం మొదలుపెట్టిన గంట వ్యవధిలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పైకప్పు లేకపోవడమూ కారణమా?.. తక్కువ ఛార్జీతో ప్రయాణం పూర్తవుతుందని వారంతా బొలేరో రవాణా వాహనం ఎక్కారు. 23మందికి కూర్చునే అవకాశం లేక నిలబడిపోయారు. వాహనం బోల్తాపడడంతో ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురుగా కింద పడడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఉదయం 7.30గంటల సమయంలో ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు 108 వాహనానికి సమాచారం ఇచ్చి ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదాలకు నిలయం.. తెనాలి-వెల్లటూరు మార్గంలో జంపని చివుకులవారి చెరువు వద్ద మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ ఏడాదికి నాలుగైదు ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో పోలీసు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. పొగమంచు కారణంగా చోదకుడు దాన్ని గుర్తించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్