మండలాలు మాయమైపోయాయి..!
జిల్లాల పునర్విభజన తర్వాత రవాణా సేవలకు సంబంధించి వాహనదార్లకు కొన్ని చిక్కులు తప్పడం లేదు.
రవాణా శాఖలో విచిత్ర పరిస్థితి
జిల్లాల పునర్విభజనతో గందరగోళం
కృష్ణా జిల్లాను క్లిక్ చేస్తే ఎన్టీఆర్ జిల్లాలో మండలాలు కన్పిస్తున్నాయి మ్యాపింగ్ ప్రక్రియ జరిగినా..
* హనుమాన్జంక్షన్కు చెందిన ఓ వ్యక్తికి రెండు నెలల కిందటే లైసెన్స్ కాల పరిమితి ముగిసిపోయింది. దీంతో రెన్యువల్ కోసం అందుబాటులో ఉన్న ఏజెంట్ని సంప్రదించి, ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయబోగా, జిల్లా ఎంపిక తర్వాత సంబంధిత మండలం ఎంచుకునేందుకు అవకాశమే లేకుండాపోయింది. దీంతో నానా తిప్పలు పడి ఆధార్ సీడింగ్ చేయించుకుని, 20 రోజుల తర్వాత కానీ రెన్యువల్ చేయించుకోలేకపోయారు.
* బాపులపాడు మండలం తిప్పనగుంటకు చెందిన రాజు అనే వ్యక్తి ఆరు నెలల కిందట పాత ద్విచక్ర వాహనం కొనుగోలు చేశారు. ఆ వాహనాన్ని తన పేరుమీదకు బదిలీ చేయించుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా నేటికీ సాధ్యం కాలేదు. ఈ తరహా ఉదంతాలు అనేకం ఉన్నాయి.
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే: జిల్లాల పునర్విభజన తర్వాత రవాణా సేవలకు సంబంధించి వాహనదార్లకు కొన్ని చిక్కులు తప్పడం లేదు. ప్రధానంగా ఆధార్ సీడింగ్ జరగని వారు తమ లైసెన్సులు రెన్యువల్ చేయించుకోవాలన్నా, విక్రయించిన పాత వాహనాలను కొనుగోలుదార్ల పేరిట బదిలీ(ట్రాన్స్ఫర్) చేయించాలన్నా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ రెండు పనుల కోసం రవాణా శాఖ అధికారికంగా వినియోగిస్తున్న ఈ-ప్రగతి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా పరిధిలో ఒక్క మండలం పేరు కూడా కన్పించడం లేదు. పైగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని మండలాలను ఎంచుకునే ఆప్షన్ చూపిస్తుండటం గమనార్హం.
నూజివీడు నుంచి మార్చాక..
జిల్లాల ఏర్పాటుకు పూర్వం నూజివీడు ఆర్టీవో కార్యాలయం కింద ఉన్న బాపులపాడు మండలాన్ని ఉయ్యూరు యూనిట్ పరిధిలోకి మార్చారు. కానీ వాహనదార్లకు సౌకర్యంగా ఉండేలా అన్ని సేవలు గుడివాడ ఆర్టీవో కార్యాలయంలో లభించేలా బాపులపాడు మండలాన్ని విలీనం చేయాలన్న డిమాండ్లు అధికంగా విన్పించాయి. కానీ ఇది పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాలేదు. ఈ క్రమంలో నూజివీడు పరిధిలో నమోదైన వాహనదార్లు ఈ ఏడాది ఏప్రిల్ అనంతరం లైసెన్సులు పునరుద్ధరించుకోవడానికి, ఆర్సీలు బదిలీ చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్లో వివరాలు సవ్యంగా లేక నెలలుగా పడిగాపులు పడుతున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని కార్యాలయాలకు సంబంధించి పని విభజన, నూతన కార్యాలయాలు ఏర్పాటు చేసిన విధంగానే రవాణా శాఖకు సంబంధించిన కార్యకలాపాల నిర్వహణకు వీలుగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆన్లైన్లో అందించే సేవలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికగా మ్యాపింగ్ ప్రక్రియ ఆరంభించారు. ఈ ప్రకారం గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల వాహనదార్లకు గుడివాడ ఆర్టీవో, మచిలీపట్నం డీటీవో ఆధ్వర్యంలో సేవలు అందుతున్నాయి. కానీ రవాణా పరిభాషలో టూటైర్ కార్డుదార్లకు మాత్రం సేవలు గగనంగా మారాయి.
ప్రహసనమే
టూటైర్ లైసెన్సు కార్డులు, ఆర్సీ కార్డులు ఉన్న వారు పునరుద్ధరణ, బదిలీ వంటి సేవలు పొందాలంటే తొలుత ఆధార్ సీడింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వాటిని ఆమోదించిన తర్వాత, ఏ తరహా సేవ కోసం దరఖాస్తు చేశామో తెలిపేలా టికెట్ రైజ్ చేయాలి. ఆ తర్వాత మనకు కేటాయించిన ఐడీ సంఖ్యను రవాణా శాఖ కాల్ సెంటర్ నంబరుకు ఫోన్ చేసి తెలియబరిస్తే, సాంకేతిక సిబ్బంది వాటిని పరిశీలించి ఆమోదించాల్సి వస్తోంది. దీనికి కనీసం 15 రోజులకు పైగా సమయం పడుతుండగా, వాహనదార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇబ్బందుల్లేకుండా చర్యలు: సీతాపతి, డీటీవో, మచిలీపట్నం
కృష్ణా జిల్లాలో ఉన్న మూడు రెవెన్యూ డివిజన్లను మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన డీటీవో పరిధిలోకి తెచ్చారు. ఏయే మండలాల వాహనదార్లు ఎక్కడెక్కడ రవాణా సేవలు పొందాలనేది ఆన్లైన్ మ్యాపింగ్ ప్రక్రియ చేశాం. ఆధార్ సీడింగ్ జరగని వాహనదార్లు సీడింగ్ కోసం దరఖాస్తు చేసుకుని, తమకెలాంటి సేవలు కావాలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న తర్వాత వచ్చిన టికెట్ వివరాలిస్తే సాంకేతిక సిబ్బంది పరిష్కారం చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు
[ 28-03-2024]
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీలు 82 రోజులకు గాను లెక్కించారు. -
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
[ 28-03-2024]
వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. -
అమ్మతోడు.. అడ్డగోలేచూడు!
[ 28-03-2024]
‘‘విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన చుండూరు వెంకటరెడ్డి (సి.వి.రెడ్డి) ఛారిటీస్ స్థలం, భవనాలను అన్యాక్రాంతం చేసేలా అడుగులు పడుతున్నాయి. -
కోడ్ కొండెక్కి.. అక్రమంగా రోడ్డెక్కి
[ 28-03-2024]
కోడ్ వచ్చి.. 10 రోజులైనా కళ్లెం పడనేలేదు. టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రుళ్లు తవ్వుతూనే ఉన్నారు. అడిగితే తీవ్ర బెదిరింపులు. చిన్నాచితక నాయకులు ఆపినా.. బడా నేతలు తవ్వేస్తున్నారు. -
పశ్చిమ బరిలో సుజనా
[ 28-03-2024]
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. -
నిజం గెలవాలి.. రాష్ట్రం వెలగాలి
[ 28-03-2024]
నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం హనుమాన్జంక్షన్, బిళ్లనపల్లిలో పర్యటించారు. -
ప్రలోభాలు అరికట్టేందుకు ముమ్మర తనిఖీలు
[ 28-03-2024]
జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేసి మద్యం, నగదు, కానుకలను పట్టుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపడతామని ఎన్నికల అధికారి రాజబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలియజేశారు. -
పార్టీ కోసం పనిచేయాల్సిందే.. ఓటర్లను మభ్యపెట్టాల్సిందే!
[ 28-03-2024]
ప్రతి ఓటరు నాడి పసిగట్టి లోబర్చుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని వైకాపా నాయకులు వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. -
ఎర్రకట్ట విస్తరణ ఎప్పుడో?
[ 28-03-2024]
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంలో రహదార్లు మాత్రం విస్తరణకు నోచుకోలేదు. వందలాది వాహనాల రాకపోకలతో ఎర్రకట్ట ప్రమాదాలకు నెలవుగా మారింది. -
రైల్వే సరకు రవాణాలో రికార్డు ఆదాయం
[ 28-03-2024]
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సరకు రవాణాలో రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. -
అయిదేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులేవీ?
[ 28-03-2024]
రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
[ 28-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామీణ మండలం దామూలూరు శివారు పంట కాలువ 19న గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. -
సీఎం జగన్ ఎగ్గొట్టిన హామీలు 85% : నెట్టెం
[ 28-03-2024]
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన పార్టీనీ చిత్తుగా ఎందుకు ఓడించాలో చెప్పడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. -
బీమా సొమ్ము చెల్లించాలని తీర్పు
[ 28-03-2024]
బీమా సొమ్ము చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కమిషన్ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. -
అయిదుగురు బుక్ కీపర్లపై వేటు
[ 28-03-2024]
కృత్తివెన్ను మండలం నీలిపూడిలో ఈ నెల 25న వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయిదుగురు వెలుగు బుక్ కీపర్లను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
దుర్గగుడి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు
[ 28-03-2024]
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో 25 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించగా.. రూ.3,78,72,537 ఆదాయం వచ్చింది. -
కృష్ణా పూర్వ డీపీవో ఉద్యోగం నుంచి తొలగింపు
[ 28-03-2024]
కృష్ణా జిల్లా పూర్వ పంచాయతీ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్న సీహెచ్ సుబ్రహ్మణ్యంను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ..
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!