బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ : మంత్రి జోగి
జంపని ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ భరోసా ఇచ్చారు.
మాట్లాడుతున్న గృహనిర్మాణశాఖా మంత్రి రమేష్, పక్కన ఎమ్మెల్యే శివకుమార్,
సబ్కలెక్టర్ గీతాంజలి శర్మ
తెనాలి(కొత్తపేట) పెదకాకాని, నగరంపాలెం, న్యూస్టుడే: జంపని ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ భరోసా ఇచ్చారు. ప్రమాద సమాచారం అందుకున్న ఆయన స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి తెనాలి ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటంబ సభ్యులను వారు పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఘటన గురించి తెలిసి దిగ్భ్రాంతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారని తెలిపారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తన దృష్టికి తెచ్చినట్లు చెప్పారు.
* కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక, వైకాపా నాయకుడు రాము, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ తెనాలి ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
మాజీ సీఎం చంద్రబాబు సంతాపం..
తెదేపా నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాద సమాచారం తెలియగానే తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారని, మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారని పేర్కొన్నారు. జంపని చెరువు మలుపు వద్ద ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని అనేక మార్లు ఆర్అండ్బీ అధికారులకు సూచించినట్లు స్పష్టం చేశారు.
క్షతగాత్రులు డిశ్చార్జి..
స్వల్ప గాయాలతో జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న 16మంది క్షతగాత్రులు సోమవారం సాయంత్రం డిశ్చార్జి అయి స్వగ్రామం నీలిపూడికి బయల్దేరి వెళ్లారు. ప్రమాదంలో మృతి చెందిన నలుగురి మృతదేహాలకు కృత్తివెన్ను మండల తహసీల్దారు రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో పంచనామా చేసిన వైద్యులు పోస్టుమార్టం చేశారు. అనంతరం వారి బంధువులకు అప్పగించారు. సమాచారం అందుకున్న తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ వెంటనే జిల్లా వైద్యశాలకు చేరుకొని క్షతగాత్రులకు వైద్యసాయం అందేలా చూశారు. రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ, వేమూరు పోలీసు అధికారులు ఆస్పత్రి వద్ద బందోబస్తు నిర్వహించారు.
పరామర్శ
జంపని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముగ్గురు గుంటూరు జీజీహెచ్కు సోమవారం తరలించారు. అనంతరం ఆటోనగర్ సమీపంలోని ఉదయ్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను మంత్రి జోగి రమేష్ పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. గాయపడిన వారు కృష్ణా జిల్లాకు చెందిన పి.శ్రీనివాస్, నాగరాజు, వెంకన్నగా గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజీనామా చేయకుంటే.. ఊరుకోం..!
[ 20-04-2024]
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. -
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే
[ 20-04-2024]
మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం. -
మహా మాయగాళ్లు..!
[ 20-04-2024]
‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. -
పేర్నీ.. స్థాయి తెలుసుకొని మాట్లాడు
[ 20-04-2024]
అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. -
కృష్ణా డెల్టాపై కక్షగట్టి.. ఎండగట్టే యత్నం: ఎంపీ
[ 20-04-2024]
రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. -
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం
[ 20-04-2024]
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
కోతల జోగి.. చేతలు ఏవీ..?
[ 20-04-2024]
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. -
పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 20-04-2024]
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
[ 20-04-2024]
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
[ 20-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. -
బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి
[ 20-04-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. -
నాట్యప్రయోగిక పరీక్షలు
[ 20-04-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా
[ 20-04-2024]
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.