కమిషనర్ అడ్డుకున్నా.. దండుకుంటాం
దుర్గమ్మ శరన్నవరాత్రుల సందర్భంగా గత సెప్టెంబరులో విజయవాడలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో సిబ్బందిని సరిపడా సమకూర్చని గుత్తేదారుకు సొమ్ములు చెల్లించడానికి రంగం సిద్ధమైంది.
దసరా ఉత్సవాల్లో ‘పారిశుద్ధ్య’ అక్రమాలు!
రూ.లక్షల దోపిడీకి యత్నం
విజయవాడ నగరపాలక సంస్థ,విజయవాడ సిటీ, న్యూస్టుడే: దుర్గమ్మ శరన్నవరాత్రుల సందర్భంగా గత సెప్టెంబరులో విజయవాడలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో సిబ్బందిని సరిపడా సమకూర్చని గుత్తేదారుకు సొమ్ములు చెల్లించడానికి రంగం సిద్ధమైంది. విజయవాడ కార్పొరేషన్ అధికారుల తీరుతో ఖజానాకు రూ.లక్షల్లో గండి పడనుంది. దసరా ఉత్సవాల సందర్భంగా స్నానఘాట్లు, ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించే బాధ్యతలను నగరపాలక సంస్థ చేపట్టింది. మూడు షిఫ్టుల్లో 1000 మంది చొప్పున 13 రోజులపాటు సిబ్బందిని సమకూర్చే కాంట్రాక్టుకు టెండర్లు ఆహ్వానించారు. ఇద్దరు గుత్తేదార్లు రోజుకు 500 మంది సిబ్బంది చొప్పున నియమించడానికి ముందుకొచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా తర్వాత అసలు కథ నడిచింది.
ఇక్కడ బట్టబయలైంది..
ఇద్దరు గుత్తేదార్లు... ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల్లో కలిపి 800 మంది, రాత్రి పూట 200 మంది పారిశుద్ధ్య సిబ్బందిని సమకూర్చాలి. వారు మాత్రం రోజుకు 150-250 మంది చొప్పున సగటున 416 మందిని మాత్రమే నియమించారు. వారితోనే మూడు షిఫ్టుల్లో పనిచేయించినట్లుగా చూపించి, అక్రమంగా రూ.లక్షలు దండుకునేందుకు యత్నించారు. కమిషనర్ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఇది వెల్లడైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే ముఖ ఆధారిత హాజరు విధానం (ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం-ఎఫ్ఆర్ఎస్) అమలు చేయాలని ఆదేశించారు. ఫలితంగా ఒకసారి ఎఫ్ఆర్ఎస్ తీసిన సిబ్బందికి 24 గంటలు(ఒకరోజు) తర్వాతే మళ్లీ హాజరు నమోదు అవుతుంది. టెండరు నిబంధన ప్రకారం పారిశుద్ధ్య సిబ్బందిని సమకూర్చని గుత్తేదార్లకు కమిషనర్ షోకాజ్నోటీసులు కూడా జారీచేశారు. ఈ వ్యవహారాన్ని కొద్దిరోజులు తొక్కిపెట్టిన అధికారులు, తాజాగా గుత్తేదార్లకు మొత్తం బిల్లులు సాధారణ నిధుల నుంచి చెల్లించేందుకు పరిపాలనా ఆమోదానికి ప్రతిపాదన తెచ్చారు.
అసలు మస్తరు ఇంతే..!
ఎఫ్ఆర్ఎస్ దెబ్బతో అన్ని రోజులకు 13 వేల మస్తర్లకు గాను 5,408 మాత్రమే నమోదయ్యాయి. ఆ లెక్కన ఇద్దరు గుత్తేదార్లకు కలిపి రూ.27.04 లక్షలు, 5 శాతం ఇతర ఛార్జీలు కింద రూ.1.35 లక్షలు కలిపి మొత్తం రూ.28.39 లక్షలు చెల్లించాల్సి ఉంది. అధికారులు మాత్రం 13వేల మస్తర్లకు రూ.500 చొప్పున రూ.65 లక్షలు, 5 శాతం ఇతర ఛార్జీల కింద మరో రూ.3.25 లక్షలు కలిపి మొత్తం రూ.68.25 లక్షలు సాధారణ నిధుల నుంచి చెల్లించాలంటూ పరిపాలనా ఆమోదానికి అధికారులు స్థాయీ సంఘం ముందుకు ప్రతిపాదనలు తెచ్చారు. దీంతో రూ.39.86 లక్షల మేర కార్పొరేషన్ ఖజానాకు చిల్లు పడనుంది.
ఇదిగో లొసుగు..
కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 97(2) ప్రకారం అధికారులు ప్రవేశపెట్టిన అంశాన్ని స్థాయీ సంఘం సభ్యులు తిరిస్కరించినా, 15 రోజుల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలా లేని పక్షంలో అధికారుల ప్రతిపాదన ఆమోదించినట్లుగా చట్టంలో వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు తెలివిగా.. సిబ్బంది సరఫరా టెండర్లను రెండుగా విభజించి ఇద్దరు గుత్తేదార్లకు కట్టబెట్టారు. బిల్లు రూ.50 లక్షలు దాటితే కౌన్సిల్లోనే ఆమోదించాలి. ఈ నేపథ్యంలో ఒక్కొక్క గుత్తేదారుకు అన్నీ కలిపి రూ.34,12,500 మించకుండా చెల్లింపు ఉండేలా టెండర్లు పిలవడంలోనే అధికారులు వ్యూహరచన చేశారు. ఆ ప్రతిపాదన గత నెల 22న జరిగిన స్థాయీ సంఘం లో వాయిదా పడినా, తర్వాత జరిగే సమావేశంలో సభ్యులు దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆటోమేటిక్గానే ఆమోదం దక్కుతుంది. ఈ స్థితిలో సభ్యులు సవరణ ప్రతిపాదన ఆహ్వానిస్తారా? కౌన్సిల్కు రిఫర్ చేస్తారా? అధికారుల అక్రమాల ప్రతిపాదనకు వంత పలుకుతారా? వంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఎఫ్ఆర్ఎస్ ప్రకారమే చెల్లిస్తాం
రత్నావళి, చీఫ్ మెడికల్ అధికారి
వాహనడిపో అధికారులు టెండర్లు పిలిచారు. గుత్తేదార్లు పూర్తిస్థాయిలో సిబ్బందిని సరఫరా చేయలేదు. మూడు షిప్టులకు ఒకరు 150 మందిని, మరొకరు 300 మందిని సరఫరా చేశారు. ఎఫ్ఆర్ఎస్ కింద ఎంతమంది ఎన్నిరోజులు వచ్చారో లెక్కించి మాత్రమే డబ్బులు చెల్లిస్తాము. స్థాయీ సంఘం ముందుంచిన ప్రతిపాదన అంశాన్ని సభ్యుల దృష్టికి కూడా తెచ్చి చర్చించాం. కొద్ది సమయం తీసుకుని తగిన నిర్ణయం తీసుకుందామని వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం