తానా అందించే ప్రతి రూపాయీ సద్వినియోగం
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అమెరికాలోని తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ద్వారా ఆదరణ కార్యక్రమాల కోసం
ఎడ్లంక విద్యార్థినులకు సైకిళ్లు అందజేస్తున్న తానా ప్రతినిధులు, బుద్ధప్రసాద్
అవనిగడ్డ, న్యూస్టుడే: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అమెరికాలోని తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ద్వారా ఆదరణ కార్యక్రమాల కోసం అందించే ప్రతి రూపాయీ సద్వినియోగం చేస్తామని తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జైశంకర్, తానా ట్రస్టీ రవి సామినేని పేర్కొన్నారు. సోమవారం స్థానిక గాంధీక్షేత్రంలో తానా పౌండేషన్ ఆధ్వర్యంలో ఎడ్లంక గ్రామ విద్యార్థినులు 25 మందికి ఏర్పాటుచేసిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతి రెండేళ్లకోసారి ఈ ఆదరణ కార్యక్రమం ద్వారా కంటి, కాన్సర్ వైద్య పరీక్షలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ల్యాప్టాప్లు, సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 500 మందికి సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 13 లక్షల డాలర్లు పేద వర్గాలకు అందించడం ద్వారా నిధులు సద్వినియోగం చేసినట్లు చెప్పారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ అమెరికాలో ఉన్నప్పటికీ మాతృభూమిని మరచిపోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎడ్లంక బాలికలు నదిని దాటి 3 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలు/కళాశాలలకు వస్తున్నారని చెప్పగానే 25 మందికి సైకిళ్లు అందించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. తానా కాబోయే అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, నైనుపాటి విశ్వనాథ్, తానా పౌండేషన్ ట్రస్టీ రవి సామినేని, కిలారు ముద్దుకృష్ణ, చావా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.