Andhra News: గన్నవరంలో దారుణం.. ప్రేమ పేరుతో బాలికను అపహరించిన చర్చి పాస్టర్‌

ఆరోగ్యం బాగోలేదని చర్చికి తీసుకెళ్లిన మైనర్‌ బాలికను స్వస్థత పేరుతో పాస్టర్‌ ట్రాప్‌ చేశాడు. మాయమాటలతో లోబర్చుకుని 3 రోజుల క్రితం బాలికను తన వెంట తీసుకెళ్లాడు.

Updated : 06 Dec 2022 17:27 IST

గన్నవరం: ఆరోగ్యం బాగోలేదని చర్చికి తీసుకెళ్లిన మైనర్‌ బాలికను స్వస్థత పేరుతో పాస్టర్‌ ట్రాప్‌ చేశాడు. మాయమాటలతో లోబర్చుకుని 3 రోజుల క్రితం బాలికను తన వెంట తీసుకెళ్లాడు. నూజివీడులో చర్చి పాస్టర్‌గా ఉన్న వ్యక్తి మైనర్‌ను ట్రాప్‌ చేయడం కలకలం రేపింది. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన నాగేశ్వర్‌ భార్య ఆనారోగ్యంతో చనిపోయింది. అతనికి సుమారు 20ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలున్నారు. నూజివీడులో చర్చికి వచ్చిన బాలికకు స్వస్థత చేకూరుస్తానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను గత కొన్ని రోజులుగా గన్నవరం మండలం ఉస్తాబాద్‌ గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచారు. బాలిక జాడ తెలుసుకున్న నాగేశ్వర్‌ ఈనెల 2న ఉస్తాబాద్‌ వచ్చి బాలికను తీసుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాగేశ్వర్‌తో పాటు బాలిక కూడా హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వీరిని గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని