ప్రేమ పేరుతో.. కత్తులు దూశారు..
ముక్కు మొహం తెలియకుండానే ఇన్స్టాగ్రాంలో పరిచయాలు. ఆపై ప్రేమ చిగురింపులు. కొన్నాళ్లు ప్రేమ పేరుతో స్నేహాలు.. ఆ తర్వాత కొంతకాలానికి వారి మధ్య అనుమానాలు.. అపోహలు ఏర్పడి చివరకు కత్తులు దూసుకునే వరకు వెళుతున్నాయి.
నాడు రమ్య.. నేడు తపస్వి ఉదంతాలు
ఈనాడు, అమరావతి
తపస్వి (పాతచిత్రం)
ముక్కు మొహం తెలియకుండానే ఇన్స్టాగ్రాంలో పరిచయాలు. ఆపై ప్రేమ చిగురింపులు. కొన్నాళ్లు ప్రేమ పేరుతో స్నేహాలు.. ఆ తర్వాత కొంతకాలానికి వారి మధ్య అనుమానాలు.. అపోహలు ఏర్పడి చివరకు కత్తులు దూసుకునే వరకు వెళుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన బీడీఎస్ విద్యార్థిని తపస్వి పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో తన స్నేహితురాలి ఇంట్లోనే ప్రేమోన్మాది జ్ఞానేశ్వర్ చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఇలాంటి ఘటనే ఏడాది కిందట గుంటూరు నగరంలో జరిగింది. బీటెక్ విద్యార్థిని రమ్య కూడా అప్పట్లో ప్రేమికుడు శశికృష్ణ చేతిలో దారుణంగా హత్యకు గురైంది. ఈ రెండు ఉదంతాల్లోనూ పెళ్లికి నిరాకరించడంతోనే ప్రేమికులు ఉన్మాదుల్లా మారి ఏకంగా ప్రాణాలు తీసేశారు.
వదిలేయాలని ప్రాధేయపడినా..
మనం ఎవరితో స్నేహం చేస్తున్నామనేది ముఖ్యం. దాన్ని గమనించకుండా వ్యవహరిస్తే సమాజంలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంజినీరింగ్ ఫెయిలై నేర స్వభావానికి అలవాటుపడిన జ్ఞానేశ్వర్తో తపస్వికి తొలుత ఇన్స్టాగ్రాంలో స్నేహం మొదలైంది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమికులుగా మారారు. కొంతకాలం కలిసి ఉన్నారు. కారణాలేమైనా వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో తనను పట్టించుకోవడం లేదని, దూరం పెడుతోందని అక్కసుతో ఏకంగా తపస్విపై సర్జికల్ బ్లేడ్తో దాడికి తెగబడి నరరూప రాక్షసుడిలా వ్యవహరించారు. ఇకనైనా తనను వదిలేయాలని ఆ యువతి ప్రాధేయపడినా ఏమాత్రం లెక్కపెట్టలేదు. కొన ఊపిరితో ఉంటే ఒక గది నుంచి మరో గదిలోకి లాక్కెళ్లి మరీ గొంతుకోసి చంపేయడం చూస్తుంటే ప్రేమోన్మాదులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమౌతోంది. పదో తరగతి కూడా పాస్కాని శశికృష్ణ అనే యువకుడి ప్రేమలో రమ్య పడింది. తర్వాత అతడి గురించి తెలుసుకుని దూరం పెట్టింది. దాన్ని తట్టుకోలేక ఏకంగా నడిరోడ్డుపైనే కత్తితో దాడి చేశాడు.
ఎవరితో స్నేహం చేస్తున్నామో తెలుసుకోవాలి
ప్రేమించడం తప్పు కాదు. అయితే ఎవరితో ప్రేమలో పడ్డాం. వారి స్వభావం ఏమిటి? వారి గత నేపథ్యం వంటివి తెలుసుకుని వ్యవహరిస్తే ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం యువతి, యువకుల్లో ఇది లోపిస్తోందని, గుడ్డిగా నమ్మేస్తున్నారని, చివరకు వారేమిటో తెలుసుకునేలోపే ఘోరం జరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి యువతీ, యువకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమించిన వ్యక్తి స్వభావం, వారి ప్రవర్తన, వారి వ్యవహారశైలిపై అమ్మాయిలకు స్పష్టమైన అవగాహన ఉండాలి.
* ప్రేమించినంత మాత్రాన పెళ్లి చేసుకోలేదని హత్యలకు పాల్పడటం, హతమార్చటం సరికాదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మహిళా సంఘాలు, రాజకీయ పక్షాలు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తుంటాయి. సమాజంలో ప్రేమ పేరుతో జరిగే అఘాయిత్యాలను ధైర్యంగా ఎదిరించాలి. తక్కెళ్లపాడులో తపస్విపై ప్రేమోన్మాది దాడి చేస్తున్న సమయంలో స్నేహితురాలు సహాయం కోసం కేకలు వేసినా కొందరు స్పందించలేదు. మరికొందరు విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకుని ప్రేమోన్మాది దాడి నుంచి ఆ యువతిని తప్పించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పంట పొలాలతో ప్రశాంత వాతావరణం ఉండే తమ గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి దారుణంగా హత్యకు గురికావడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!