తెలుగు రాయలేరు.. కూడికా చేయలేరు..!
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఇటీవల విజయవాడలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు.
తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల పరిస్థితి దారుణం
ప్రభుత్వ బడుల్లో పడిపోయిన ప్రమాణాలు
ఉన్నతాధికారుల తనిఖీల్లో వెలుగులోకి
ఈనాడు, అమరావతి
ఇటీవల ఓ పాఠశాలలో విద్యార్థులను పరీక్షిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఇటీవల విజయవాడలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. తొమ్మిదో తరగతి పిల్లలు.. తెలుగులో పేర్లు కూడా సరిగా రాయలేకపోవడం కనిపించింది. తెలుగు పుస్తకాన్ని చూసి కూడా చదవలేకపోతున్నారు. మూడంకెల చిన్న కూడికను చేయలేని పరిస్థితి కనిపించింది. ఆర్జేడీ దుక్కిపాటి మధుసూదనరావు కూడా కొండపల్లిలోని జడ్పీ బాలుర, బాలికల పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. అక్కడా ఇదే పరిస్థితి కనిపించింది.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాలు దారుణంగా పడిపోయాయి. కొవిడ్ ముందు కంటే విద్యా ప్రమాణాల పరిస్థితి ప్రస్తుతం మరింత దిగజారిపోయింది. ఎనిమిదో తరగతి నుంచి పది వరకూ విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది తెలుగు, ఆంగ్లం ఓ మోస్తరుగా కూడా చదవలేకపోతున్నారు. పక్కన కూర్చున్న విద్యార్థి పేరు కూడా రాయలేకపోతున్నారు. దీంతో వీళ్లు పదో తరగతి పరీక్షలు ఎలా ఉత్తీర్ణులవుతారంటూ అధికారులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా ప్రమాణాలు మెరుగు పర్చేందుకు సరైన చర్యలు చేపట్టకపోవడం, కనీసం పర్యవేక్షణ కూడా లేకపోవడంతో పరిస్థితి ఇలా మారింది.
ఎవరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు..
గతంలో ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు.. తరగతిలో 5-10 మంది పిల్లలు మాత్రం సమాధానాలు సరిగా చెప్పలేకపోయేవారు. మిగతా వారు బాగానే చెప్పేవారు. ప్రస్తుతం తరగతిలో ఉన్న పిల్లలందరి పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. తెలుగు సంధులు, సమాసాలు, ఆంగ్లం డిక్టేషన్, హిందీ రీడింగ్.. ఇలా అన్నింటిలోనూ తడబడుతున్నారు. అధికారులు ఒక ప్రశ్న అడిగి.. తరగతిలో ఉన్న ఏ విద్యార్థి అయినా దీనికి సమాధానం చెబుతారా.. అని అడుగుతుంటే.. ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము బాగానే చెబుతున్నామని, ద్యార్థులు ఆసక్తి చూపించడం బాగా తగ్గిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో రెండేళ్లు పూర్తిగా విద్యాబోధన గాడి తప్పడంతో.. విద్యార్థులు తరగతిలో కూర్చోవడానికీ ఇబ్బందిగా భావిస్తున్నారన్నారు.
దృష్టి పెట్టేదెలా? ప్రస్తుతం ఉపాధ్యాయులకు తరగతి గదుల్లో బోధన కంటే.. యాప్లలో అప్లోడ్లు, నాడు నేడు పనుల బాధ్యతలను చూడడం వంటివే ముఖ్యమనేలా విద్యాశాఖ అధికారుల తీరు ఉంటోంది. కొవిడ్ తర్వాత విద్యార్థుల్లోని సామర్థ్యాలు బాగా తగ్గిపోయాయి. వారిని తిరిగి గతంలో మాదిరిగా మార్చాలంటే.. మరింత ఎక్కువ దృష్టి పెట్టేలా చేయాలి. ఈ విషయంలో అధికారులు విఫలమవ్వడం వల్లే ఫలితాలు ఇలా కనిపిస్తున్నాయి.
పర్యవేక్షణ సరిగా లేక..
కృష్ణాలో ఉయ్యూరు, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ, తిరువూరుకు ఉప విద్యాశాఖ అధికారులు లేరు. ప్రభుత్వ పరీక్షలను పర్యవేక్షించే.. అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) కూడా ఎన్టీఆర్ జిల్లాలో లేరు. సమగ్ర శిక్ష ఏపీసీ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. అర్హులైన అధికారులతో వీటిని భర్తీ చేసి, పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
ఫలితాలు దారుణం
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈ ఏడాది 55 వేల మంది వరకూ పదో తరగతి పరీక్షలను రాయబోతున్నారు. గత ఏడాది ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా ఉత్తీర్ణత శాతం అత్యంత దారుణంగా పడిపోయింది. కేవలం 65.21శాతం మాత్రమే నమోదైంది. ఒక్క విద్యార్థి కూడా పాసవ్వని పాఠశాలలు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది ఉండడం గమనార్హం. కనీసం ఇప్పటి నుంచైనా పది విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి, పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రయత్నం చేయకుంటే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
[ 24-04-2024]
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
[ 24-04-2024]
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
[ 24-04-2024]
వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. -
అంటకాగితే.. అంతే రాణా..!
[ 24-04-2024]
అధికార వైకాపాతో అంటకాగుతూ.. ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. -
జగన్ షాకులు.. జనం కేకలు!
[ 24-04-2024]
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. -
తవ్వుకో.. దండుకో!
[ 24-04-2024]
పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. -
పేర్ని కిట్టూ నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం
[ 24-04-2024]
స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్ అన్నారు. -
ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు
[ 24-04-2024]
రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు
[ 24-04-2024]
జిల్లాలోని పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!
[ 24-04-2024]
ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్లు ఇస్తుంటారు. -
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
[ 24-04-2024]
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పాత బూత్ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 24-04-2024]
అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. -
సింహ వాహనంపై ఆది దంపతులు
[ 24-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. -
ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
[ 24-04-2024]
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. -
జనంపై జగనన్న అదనపు బాదుడు
[ 24-04-2024]
విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రీడింగ్ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్డ్, ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. -
గుడివాడ పసుపుమయం
[ 24-04-2024]
గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్కు జనం తరలి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!