ధాన్యం రైతుల సమస్యలు పరిష్కరించండి
ధాన్యం విక్రయానికి రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారులు పరిష్కరించాలని జడ్పీటీసీ సభ్యులు కోరారు.
మాట్లాడుతున్న ఛైర్పర్సన్ హారిక
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: ధాన్యం విక్రయానికి రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారులు పరిష్కరించాలని జడ్పీటీసీ సభ్యులు కోరారు. జడ్పీలో మంగళవారం నిర్వహించిన స్థాయి సంఘ సమావేశంలో రైతుల సమస్యలను వారు వివరించారు. రవాణా వాహనాలు, తేమ శాతం విషయంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెరగడం, ధరలు తగ్గడం వల్ల ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మృతి చెందిన పశువులకు బీమా సకాలంలో అందేలా చూడాలని నందిగామ శాసనసభ్యుడు మొండితోక జగన్మోహనరావు కోరారు. గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్యం, పనులు తదితర స్థాయి సంఘ సమావేశాలకు అధ్యక్షత వహించిన జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ.. స్థాయి సంఘ సమావేశాలకు కొందరు అధికారులు గైర్హాజరవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా సమావేశానికి రాని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామీణాభివృద్ధిపై నిర్వహించిన సమావేశంలో మిషన్ అమృత్ సరోవర్ ద్వారా చేపట్టిన పనుల గురించి డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ వివరించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల్లో పురోగతిపై ఛైర్పర్సన్ ఆరా తీశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వ్యవసాయాధికారులు మనోహరరావు, విజయభారతి రెండు జిల్లాల పరిధిలో ఖరీఫ్ దిగుబడులు, ఈ- పంట నమోదు, పొలం బడి కార్యక్రమాల గురించి తెలియజేశారు. మొత్తం 2.25 లక్షల మంది రైతులకు రూ.4,200 కోట్లు, 19,745 మంది రైతులకు రూ.227 కోట్లు పంట రుణాలుగా ఇచ్చారని వెల్లడించారు. స్త్రీ, శిశు సంక్షేమం, రక్షణ స్థాయి సంఘ సమావేశంలో అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, వెంటనే పూర్తి చేయాలని కోరారు. కొన్ని నియోజకవర్గాల్లో బోర్లు తవ్వేందుకు ఎంఓయూ చేయించుకోడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదని సభ్యులు తెలిపారు. రైతులు ముందుకు వచ్చి బోర్లు వేసుకుంటే నిధులు వారికే నేరుగా మంజూరు చేస్తారని అధికారులు తెలియజేశారు. జగనన్న కాలనీల్లో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లుల మంజూరులో జాప్యం చేసుకుంటోందని చెప్పారు. అన్ని బిల్లులు గృహ నిర్మాణ శాఖకు సమర్పించామని, నిధులు మంజూరైన వెంటనే లబ్ధిదారులకు చెల్లిస్తారని అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ స్థాయి సంఘ సమావేశానికి జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి, స్త్రీ, శిశు సంక్షేమ సంఘ సమావేశానికి ఉంగుటూరు జడ్పీటీసీ సభ్యురాలు దుట్టా సీతారామలక్ష్మి, సాంఘిక సంక్షేమ సమావేశానికి వైస్ ఛైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు అధ్యక్షత వహించారు. తొలుత అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. జడ్పీ సీఈవో జి.శ్రీనివాసరావు, డీపీవో నాగేశ్వరనాయక్, ఏడీ మైన్స్ రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్