బిడ్డకు జన్మనిచ్చిన బాలిక
బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో పోక్సో చట్టం కింద భర్తపై కేసు నమోదు చేసినట్లు విజయవాడ కొత్తపేట పోలీసులు మంగళవారం తెలిపారు.
భర్తపై పోక్సో కేసు నమోదు
చిట్టినగర్(విజయవాడ), న్యూస్టుడే: బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో పోక్సో చట్టం కింద భర్తపై కేసు నమోదు చేసినట్లు విజయవాడ కొత్తపేట పోలీసులు మంగళవారం తెలిపారు. విజయవాడలోని ఒక కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలిక, అదే కాలనీకి చెందిన మోహన్ అనే యువకుడిని ప్రేమించి 2021 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. దీనికి బాలిక తల్లి ఒప్పుకోలేదు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు అదే కాలనీలో వేరే కాపురం పెట్టారు. 2022 మే నెలలో బాలిక గర్భిణి అని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈనెల 5న పురిటి నొప్పులతో బాధపడుతుండగా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి వర్గాలు చిన్న వయస్సులో పెళ్లిపై కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలిక తల్లి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు మోహన్పై పోక్సో కేసు నమోదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: అచ్యుతాపురం సెజ్లో భారీ పేలుడు.. ఒకరి మృతి
-
Crime News
Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
-
India News
Modi: బడ్జెట్ సమావేశాలకు ముందే.. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు..!
-
India News
Vistara: విమాన ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని కొట్టి, అర్ధ నగ్నంగా తిరిగి..!
-
Sports News
Womens U19 Team: బుధవారం సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్కప్ విజేతలకు సత్కారం
-
India News
Congress: రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం.. మంచు కారణమట..!