logo

బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో పోక్సో చట్టం కింద భర్తపై కేసు నమోదు చేసినట్లు విజయవాడ కొత్తపేట పోలీసులు మంగళవారం తెలిపారు.

Published : 07 Dec 2022 03:36 IST

భర్తపై పోక్సో కేసు నమోదు

చిట్టినగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే: బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో పోక్సో చట్టం కింద భర్తపై కేసు నమోదు చేసినట్లు విజయవాడ కొత్తపేట పోలీసులు మంగళవారం తెలిపారు. విజయవాడలోని ఒక కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలిక, అదే కాలనీకి చెందిన మోహన్‌ అనే యువకుడిని ప్రేమించి 2021 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. దీనికి బాలిక తల్లి ఒప్పుకోలేదు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు అదే కాలనీలో వేరే కాపురం పెట్టారు. 2022 మే నెలలో బాలిక గర్భిణి అని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈనెల 5న పురిటి నొప్పులతో బాధపడుతుండగా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి వర్గాలు చిన్న వయస్సులో పెళ్లిపై కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలిక తల్లి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్న పోలీసులు మోహన్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని