మహా అవస్థలు
విజయవాడ నడిబొడ్డున వైకాపా నిర్వహించిన జయహో బీసీ సభ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ట్రాఫిక్ చక్రబంధంలో ప్రజలు
సీఎం ప్రసంగించే సమయంలో బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న
మరికొందరిని నిలువరిస్తున్న పోలీసులు
ఈనాడు, అమరావతి: విజయవాడ నడిబొడ్డున వైకాపా నిర్వహించిన జయహో బీసీ సభ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యక్రమానికి శివార్లలో కాకుండా రద్దీగా ఉండే బందరురోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని వేదికగా ఎంచుకోవడంతోనే జనాల కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో జనాలను ఇక్కడికి తరలించారు. దీనికోసం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. పోలీసులు అత్యుత్సాహానికి పోయి పలురోడ్లను మూసేయడంతో పాటు ప్రజారవాణాను అనుమతించలేదు. దీనివల్ల నగరవాసులు నిత్యం ఉండే ట్రాఫిక్ జామ్ల కంటే రెట్టింపు కష్టాలు చవిచూశారు.
విజయవాడలో సీఎం సభాస్థలి వెనుకభాగంలో భోజనాల కోసం తోపులాట
దూరం పెరిగి కష్టాలు.. సభ కోసం జాతీయరహదారిని స్తంభింపజేయడంతో అవస్థలు అన్నీ ఇన్నీ కావు. బుధవారం తెల్లవారుజాము నుంచే అన్నివైపులా మళ్లించారు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చెన్నై-కోల్కతా జాతీయరహదారిపై హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, చీరాల, ఒంగోలు మార్గంలో మళ్లించారు. హైదరాబాద్-విశాఖపట్నం మార్గంలోనూ ఇలాగే మళ్లింపులతో ఇబ్బందులు పడ్డారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను చుట్టుతిప్పి పంపించారు.
సీఎం సభ జరుగుతుండగానే వెళ్లిపోతున్న కార్యకర్తలు
నగరంలోనూ ఇంతే.. నగంలో ట్రాఫిక్ కష్టాలు ఉదయం 7.30 నుంచే కనిపించాయి. సభ పూర్తయిన రెండుగంటల వరకూ ఇక్కట్లు తప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు 2వేలకు పైగా వచ్చాయి. వీటితోపాటు నాయకులు, కార్యకర్తలు 2వేల వ్యక్తిగత వాహనాల్లో తరలివచ్చారు. దీంతో పార్కింగ్ ప్రదేశాలు నిండిపోయాయి. దీంతో బస్సుడ్రైవర్లు చేసేది లేక బస్స్టేషన్లోకి తీసుకెళ్లి నిలిపారు. ఉదయం 8 గంటల సమయంలో మహానాడు కూడలి, బెంజిసర్కిల్, రమేష్ ఆస్పత్రి కూడలి, రామవరప్పాడు రింగ్లో విపరీతమైన రద్దీ కనిపించింది. ట్రాఫిక్ నిషేధాజ్ఞల కారణంగా వాహనాలను అనుమతించకపోవడంతో చాలామంది విద్యాసంస్థలు, కార్యాలయాలకు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది.
బిషప్ అజరయ్య పాఠశాల వద్ద దారిలేక ఆగిపోయిన అంబులెన్స్
ప్రజారవాణా లేక.. బందరు రోడ్డు, ఐదో నెంబరు మార్గంలో సిటీబస్సుల రాకపోకలను నిషేధించారు. దాంతో ప్రయాణికులు చాలా దూరం నడిచి వెళ్లి, ఇతర పాయింట్లలో ఎక్కారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రోడ్లపైకి వచ్చినవారు నరకయాతన పడ్డారు. సభకు వచ్చే వాహనాల కోసం చాలా అంతర్గత రోడ్లను మూసేశారు. చుట్టుగుంట, సీతారాంపురం రోడ్లపై ప్రజలు రాకుండా బ్యారికేడ్లను అడ్డుపెట్టారు. మొగల్రాజపురం వైపు వెళ్లేవారూ కష్టాలు పడ్డారు. నక్కలరోడ్డులోని ఆసుపత్రులకు వెళ్లేవారు చాలా అవస్థలు పడ్డారు.
పూర్తయిన తర్వాతా.. సభ పూర్తి అయి తిరిగి వెళ్లే సమయంలోనూ ఒకేసారి బస్సులు, వాహనాలు బయలుదేరడంతో నగరంలో మళ్లీ ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. బెంజి సర్కిల్, మహానాడు, రామవరప్పాడు, ఎనికేపాడు మొదలు నిడమానూరు జంక్షన్ల వరకు వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. సాయంత్రం నగరంలోకి భారీ వాహనాలను అనుమతించే సమయంలో గన్నవరం వద్ద దాదాపు మూడు కి.మీ. మేర బండ్లు ఆగాయి. సర్వీసురోడ్లపై ఉన్న వాహనాలు అన్నీ ఒకేసారి జాతీయరహదారిపైకి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట