బీఈడీ ప్రవేశాలపై సందిగ్ధం
‘కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించి ప్రతిష్ఠంభన నెలకొంది.
పునఃపరిశీలన విషయంలో తీవ్ర జాప్యం
కృష్ణా వర్సిటీ, విద్యా సంస్థల మధ్య కుదరని సయోధ్య
ఈనాడు, అమరావతి
‘కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించి ప్రతిష్ఠంభన నెలకొంది. అన్ని బీఈడీ కళాశాలల్లోని వసతులు, విద్యార్థులు, సిబ్బంది పరిస్థితిని స్వయంగా పునఃపరిశీలించిన తర్వాతే ప్రవేశాలకు వెళ్లాలనే ధోరణిలో విశ్వవిద్యాలయం ఉంది. కానీ.. ఈ ప్రక్రియ వేగవంతంగా జరగడం లేదు. ఉన్నత విద్యామండలి తీరు కూడా ఇలాగే ఉండడంతో డిసెంబర్ 07 నుంచి ఆరంభమవ్వాల్సిన తరగతులు.. జనవరిలోనైనా అవుతాయో లేదో అనే అనుమానం ప్రస్తుతం నెలకొంది. దీనికితోడు బీఈడీ కళాశాలల యాజమాన్యాలు, కృష్ణా వర్సిటీ మధ్య పలు విషయాల్లో సయోధ్య కుదరడం లేదు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థుల సంఖ్య, స్టాఫ్ అప్రూవల్, డిసెంబర్ నుంచి అమలు చేయాల్సిన ఫేస్ రికగ్నేషన్ ఈ మూడు విషయాలపై సందిగ్ధం నెలకొంది. తాజాగా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల యాజమాన్యాలన్నీ దీనిపై సమావేశమయ్యారు. ఉన్నత విద్యామండలి, కృష్ణా వర్శిటీ, కళాశాలల యాజమాన్యాల తీరుతో.. విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం కనిపిస్తోందని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’
కృష్ణా వర్సిటీ పరిధిలోని అన్ని బీఈడీ కళాశాలల్లో మూడు నెలల కిందటే ఇన్స్పెక్షన్ జరిగింది. కానీ.. ఇన్స్పెక్షన్ బృందాలు సక్రమంగా పరిశీలించకుండానే పచ్చజెండా ఊపేశారు. ఒక్కో కళాశాల నుంచి రూ.25 వేల వరకూ తీసుకుని.. వ్యవహారం కానిచ్చేశారనే ఆరోపణలున్నాయి. విశ్వవిద్యాలయం నుంచి అన్ని కళాశాలలకు ఇప్పటికే మరోసారి పరిశీలనకు వస్తామనే సమాచారం కూడా ఇచ్చారు. కానీ.. అనుకున్నంత వేగంగా కళాశాలల్లో పరిశీలన జరగడం లేదు. కేవలం కొన్ని కళాశాలలకే బృందాలు వచ్చి వెళ్లాయని సమాచారం. దీనిపై విశ్వవిద్యాలయం ఎలాంటి సమాచారం బయటకు చెప్పడం లేదు. ఈసారి ఆకస్మికంగా పరిశీలనకు బృందాలను పంపుతున్నట్టు తెలుస్తోంది. విజయవాడ పరిధిలోని మూడు ప్రధాన బీఈడీ కళాశాలలకూ వర్సిటీ బృందాలు ఇంకా రాలేదు. దీంతో ఈ పునఃపరిశీలన ఎప్పటికి పూర్తి చేస్తారనేది విశ్వవిద్యాలయం అధికారులకే తెలియాలి.
ఒకరికే మూడేసి కళాశాలల్లో..
కృష్ణా వర్సిటీ పరిధిలో 22 బీఈడీ కళాశాలలుండగా.. ఏటా వెయ్యి మందికి పైగా కొత్తగా చేరుతుంటారు. వీరిలో చాలావరకూ విద్యార్థులు కళాశాల ముఖం చూడకుండానే కోర్సును పూర్తిచేస్తున్నారు. వీరికి ప్రవేశాలు కల్పించినప్పుడే కళాశాలల యాజమాన్యాలు ఈమేరకు హామీ ఇస్తున్నాయి. పైగా కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు కూడా రిజిస్టర్లలోనే ఉంటారు. కొంతమంది అధ్యాపకుల పేర్లు రెండు మూడు కళాశాలల్లో కనిపిస్తుంటాయి. ఇలా.. ఒక్కో లెక్చరర్ కనీసం మూడు కళాశాలల్లో స్టాఫ్ అప్రూవల్ చేసుకుని ఉండడం విచిత్రం. ఇలా ఒకరినే మూడేసి కళాశాలలకు సంబంధించి స్టాఫ్ అప్రూవల్ ఎలా చేశారనేది విశ్వవిద్యాలయానికే తెలియాలి.
మేనేజ్మెంట్ కోటాలో హామీలతో ప్రవేశాలు..
కళాశాలల్లో ఫేస్ రికగ్నేషన్ను ఖచ్చితంగా అమలు చేయించాలని కృష్ణా వర్సిటీ భావిస్తోంది. దీనికి సంబంధించి కళాశాలల్లో ఇప్పటివరకూ ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. దీనితో పాటు కళాశాలల్లో లేని సిబ్బందిని ఉన్నట్టు చూపించడంపైనా విశ్వవిద్యాలయం దృష్టిసారించింది. ఈ రెండు విషయాలపై స్పష్టత వచ్చాకే.. ప్రవేశాలు కల్పించడం, తరగతులు ఆరంభించడం చేయాలనే ఆలోచనలో ఉంది. కానీ.. ఈ విషయంలో వేగవంతమైన చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులకు జాప్యం జరుగుతోంది. పక్కనే ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండేళ్ల కోర్సు ఒకే ఏడాదిలో పూర్తయ్యేలా వేగంగా చేసున్నారు. అక్కడ 2022 జున్, జులైలో ఆరంభమైన ఎంఈడీ వాళ్లు వచ్చే ఏడాది జనవరికి మూడో సెమిస్టర్ పూర్తిచేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఒక ఏడాది పోవడంతో దానిని భర్తీ చేసేందుకు ఇలా చేస్తున్నారు. కానీ.. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ వేగం కనిపించడం లేదు. పైగా.. బీఈడీ కళాశాలలకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను సక్రమంగా నిర్వహించే పద్ధతి కూడా లేదు. దీంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది. ఎన్నో ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కళాశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కళాశాలలు విద్యార్థులకు ముందస్తు హామీలను ఇచ్చేసి ప్రవేశాలు కల్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరు కళాశాలకు రావాల్సిన పనిలేదనే హామీతోనే చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఫేస్ రికగ్నేషన్ను పెడితే.. వీరు ఖచ్చితంగా కళాశాలకు రావాలి. అది కుదరని పని. అందుకే.. మేనేజ్మెంట్ విద్యార్థులకు ఈ నూతన హాజరు విధానం వద్దనే వాదనను కొన్ని కళాశాలల యాజమాన్యాలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ