logo

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

విద్యుదాఘాతంతో పెనమలూరు పల్లెపేటకు చెందిన బోరు నిర్మాణ కార్మికుడు అండ్రాజు శివశేఖర్‌(36) ప్రాణాలు కోల్పోయారు.

Published : 08 Dec 2022 05:07 IST

శివశేఖర్‌ మృతదేహం

పెనమలూరు, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో పెనమలూరు పల్లెపేటకు చెందిన బోరు నిర్మాణ కార్మికుడు అండ్రాజు శివశేఖర్‌(36) ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. పోరంకి నారాయణపురం కాలనీ సమీపంలోని ఖాళీ ప్లాటులో జరుగుతున్న బోరు నిర్మాణ పనుల్లో శివశేఖర్‌ రెండ్రోజులుగా పని చేస్తున్నారు. బుధవారం పనిలో ఉండగా మధ్యాహ్నం గాలి తీవ్రతకు సమీపంలో  వదులుగా ఉన్న విద్యుత్తు తీగలు బోరు నిర్మాణానికి ఏర్పాటు చేసిన ఇనుపరాడ్‌లకు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. సహ కార్మికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు, విద్యుత్‌ శాఖ అధికారులు వచ్చి పరిశీలించగా అప్పటికే శివశేఖర్‌ మృతి చెందినట్లు గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనుమానాస్పదమృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని