యువ ఇంజినీరుకు ప్రాణభిక్ష
ప్రాణాపాయ స్థితిలో వచ్చిన యువ ఇంజినీరుకు గుంటూరు సర్వజనాసుపత్రి న్యూరాలజీ వైద్యులు ప్రాణభిక్ష పెట్టారు. దీనికి కృతజ్ఞతగా ఆ యువ ఇంజినీరు ఆ విభాగం అభివృద్ధికి రూ.50 వేలు విరాళం అందజేశారు.
న్యూరాలజీ విభాగాధిపతి ఆచార్య సుందరాచారికి నగదు అందజేస్తున్న యశ్వంత్
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: ప్రాణాపాయ స్థితిలో వచ్చిన యువ ఇంజినీరుకు గుంటూరు సర్వజనాసుపత్రి న్యూరాలజీ వైద్యులు ప్రాణభిక్ష పెట్టారు. దీనికి కృతజ్ఞతగా ఆ యువ ఇంజినీరు ఆ విభాగం అభివృద్ధికి రూ.50 వేలు విరాళం అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన చెరుకూరి యువ ఇంజినీర్ యశ్వంత్ గత అక్టోబరు 10న రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐదు రోజులు గడిచినప్పటికీ కోమాలోనే ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డ బతుకుతాడో? లేదో? అంటూ భయపడిపోయారు. అదే సమయంలో గుంటూరు న్యూరాలజీ విభాగంలో మెరుగైన చికిత్స అందుతుందని బంధువులు తెలియజేయడంతో హుటాహుటిన అదేనెల 15వ తేదీన జీజీహెచ్ న్యూరాలజీ విభాగానికి తరలించారు. వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్న అతన్ని ఐసీయూలో చేర్చుకుని వైద్య సేవలు ప్రారంభించారు. మెదడులో రక్తస్రావం జరిగినందున కీలక భాగాలు ప్రభావితమైనట్లు గుర్తించారు. వీటికి ఏపాటి నష్టం జరిగినా ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. సర్జరీ చేసేందుకు అవకాశం లేదు. దీంతో ఆధునిక వైద్యరంగంలో అందుబాటులో ఉన్న ఔషధాలను వినియోగించి చికిత్స అందించారు. నెల రోజులు ఆసుపత్రిలోనే చికిత్స పొందిన అనంతరం కోలుకున్నాడు.
నడుస్తానని ఊహించలేదు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ప్రాణాలతో బయటపడతానని ఎవరూ ఊహించలేదని యశ్వంత్ తెలిపారు. న్యూరాలజీ విభాగంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తాను ఈ విధంగా నడిచి వచ్చానంటే న్యూరాలజీ విభాగం వైద్యులు పెట్టిన ప్రాణభిక్షగానే భావిస్తున్నానని తెలిపారు. నోటి మాట లేదు, శ్వాస తీసుకోవడమే కష్టంగా ఉండేది, ఆసుపత్రిలో ఆచేతనంగా పడక మీద పడి ఉన్న తనను గుంటూరు జీజీహెచ్లో చేర్పించడంతో ప్రాణాలతో బయట పడ్డానన్నారు. ఆ విభాగం అధిపతి ఆచార్య సుందరాచారి నేతృత్వంలో అక్కడి వైద్యులు, విద్యార్థి వైద్యులు 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడన్నారు. తమ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తూ వారిలోనూ భరోసా కల్పించారన్నారు. కార్పొరేట్ రంగంలో లక్షల రూపాయల ఖర్చు చేసినా ఫలితం ఎలా ఉండేదో తనకు తెలియదన్నారు. జీజీహెచ్లో పైసా ఖర్చు లేకుండా అత్యాధునిక చికిత్స అందించారన్నారు. వారికి తన జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఆ విభాగం అభివృద్ధికి రూ.50 వేలు తమ వంతు సాయంగా అందించానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు