logo

రోడ్డు ప్రమాదంలో పోలీసులకు గాయాలు

ఒక కారు అతివేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు  గాయాలైన ఘటన బుధవారం సాయంత్రం తోట్లవల్లూరు పెట్రోల్‌ బంకు సమీపంలో చోటు చేసుకుంది.

Published : 08 Dec 2022 05:07 IST

సీఎం బందోబస్తుకు వెళ్లొస్తుండగా ఘటన

ఘటనా స్థలంలో కారు, ద్విచక్ర వాహనం

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : ఒక కారు అతివేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు  గాయాలైన ఘటన బుధవారం సాయంత్రం తోట్లవల్లూరు పెట్రోల్‌ బంకు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పమిడిముక్కల మండలంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ హరికృష్ణ, హెడ్‌కానిస్టేబుల్‌ మహ్మద్‌ రసూల్‌లు బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి కరకట్ట మీదుగా ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. తోట్లవల్లూరు సమీపంలోకి రాగానే అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతున్న కారు అతి వేగంగా వారిని ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం బాగా దెబ్బతింది. ఒక వేళ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టకపోతే.. కారు నేరుగా కేఈబీ కాల్వలోకి దూసుకెళ్లేదని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారులో మహళలు, చిన్న పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని 108 వాహనానికి సమాచారం అందించారు. క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంగళగిరికి చెందిన కారు డ్రైవర్‌ కుమ్మారెడ్డి వీరారెడ్డి... నిద్ర మత్తులోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. వివరాలు నమోదు చేసుకుని కారును స్టేషన్‌కు తరలించామని ఎస్సై రమేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని