గృహప్రవేశ మేళాలు.. ఇళ్లకు తాళాలు!
కృష్ణా జిల్లా బందరు నియోజకవర్గానికి చెందిన 16 వేలమందికి కరగ్రహారంలో నివేశన స్థలాలు ఇచ్చారు. ఇంతవరకు మెరక పనులు పూర్తి కాలేదు.
జగనన్న కాలనీల్లో మౌలిక వసతులేవీ?
లక్ష్యాలు సాధించాలని ఒత్తిడి
ఈనాడు, అమరావతి
కరగ్రహారంలో నిర్మాణమే జరగలేదు
కృష్ణా జిల్లా బందరు నియోజకవర్గానికి చెందిన 16 వేలమందికి కరగ్రహారంలో నివేశన స్థలాలు ఇచ్చారు. ఇంతవరకు మెరక పనులు పూర్తి కాలేదు. కానీ ఉన్నతాధికారులకు పంపిన కృష్ణా జిల్లాలో ఇళ్ల నిర్మాణ పురోగతిలో నివేదికలో ప్రారంభం కానివి 4,230 అని పేర్కొన్నారు. డిసెంబరు 21న సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం జిల్లాలకు లక్ష్యాలను నిర్దేశించింది. ఇప్పటివరకు జిల్లాలో కేవలం 6,967 పూర్తి అయినట్లు నివేదించారు. ఎన్టీఆర్ జిల్లాలో 21 నాటికి 12వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. ఇప్పటికి 5,026 ఇళ్లే పూర్తి చేసుకున్నాయి. లక్ష్యం సాధించడానికి అధికారులు హైరానా పడుతున్నారు.
గత రెండన్నరేళ్లుగా పూర్తికాని గృహాలను మరో 20 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని, ప్రజాప్రతినిధులతో గృహ ప్రవేశాలను ఆడంబరంగా చేయించాలని ఆదేశాలు అందాయి. ప్రవేశాలు చేసినా.. నివాసం ఉండే పరిస్థితి లేదు. కాలనీల్లో కనీస వసతులు లేవు. విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజీ, కనీస రహదారులు లేవు. నిర్మాణం పూర్తి చేసి ఇంటికి తాళం వేసినవారే చాలా మంది ఉన్నారు. కొన్ని సొంతంగా లబ్ధిదారులు నిర్మాణం చేసుకున్నారు. కొన్ని గుత్తేదారులతో నిర్మాణం చేయిస్తున్నారు. చాలా వరకు తుది దశకు చేరుకున్నాయి. కొంతమంది ప్రభుత్వం ఇచ్చే రాయితీకి అదనంగా సొమ్ములు వేసి నిర్మాణం చేసుకున్నారు. వీటికి ఇప్పటికే తాళాలు వేశారు. రవాణా సౌకర్యం లేదు. విద్యుత్తు సౌకర్యం కల్పించలేదు. అక్కడ ఒక సబ్స్టేషన్ నిర్మాణం చేయాల్సి ఉంది. బోర్లు వేసినా ట్యాంకులు, కుళాయిలు ఏర్పాటు చేయలేదు. కొండపల్లి లేఔట్లోనూ దాదాపు 1200 గృహాలను నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ విద్యుత్తు లేదు. అదనంగా ట్రాన్స్ఫారాలు కావాలని చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం లేఔట్లోనూ అదే పరిస్థితి. అర్బన్ లేఔట్లలో మౌలిక వసతుల కల్పనకు నిధులు అందుబాటులో లేవు. కొన్ని లేఔట్లలో ఆర్డబ్ల్యూఎస్కు తాగునీటి బోర్లు వేసేందుకు లక్ష్యాలను నిర్దేశించారు. అంతర్గత రహదారులు నరేగా కింద నిర్మాణం చేయాలని సూచించారు. విద్యుత్తు సౌకర్యంపై అధికారులు ఒత్తిడి చేస్తున్నా అసంస్థ ఉలుకూపలుకు లేదు. నగరపాలక సంస్థ నిధులు వెచ్చించాలని సూచించారు. కొన్నింటికి టెండర్లను పిలిచినా గుత్తేదారులు స్పందించడం లేదు. బిల్లులు రావనే ఉద్దేశంతో అసలు టెండర్లనే దాఖలు చేయడం లేదు. దీంతో జగనన్న లేఔట్లో నివాసం ఎప్పుడనేది అయోమయంగా ఉంది.
అడ్డంకులు ఎన్నో..!
కేవలం మౌలిక వసతులే కాదు.. ముందుగా నిర్మాణం పూర్తి కావాలంటే లబ్ధిదారులు అదనంగా ఖర్చు భరించాల్సి వస్తోంది. ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ.1.8లక్షలు, డ్వాక్రా రుణం రూ.35వేలు కలిపి రూ.2.15లక్షలు అవుతోంది. ఈ మొత్తంతో ఇంటి నిర్మాణం పూర్తి కావడం లేదు. కొంత మంది గుత్తేదారులు ఈ మొత్తానికి ఫినిషింగ్ (ప్లాస్టరింగ్, మరుగుదొడ్డి, కిచెన్లో సౌకర్యాలు) లేకుండా నిర్మాణం చేస్తున్నారు. ప్లాస్టరింగ్ కావాలంటే రూ.2.75లక్షలకు నిర్మాణం చేస్తున్నారు. అదనంగా రూ.60వేల వరకు చేతి నుంచి పడుతున్నాయి. అదనపు వసతులు, మెట్లు ఇతర సౌకర్యాలు కావాలంటే.. రూ.9లక్షల వరకు అడుగుతున్నారు. ఇది ఒక సమస్య అయితే ఇసుక లభ్యం కావడం లేదు. జగనన్న కాలనీలకు గుత్తేదారులు బుసక సరఫరా చేస్తున్నారు. దీంతో కట్టుబడి సాధ్యం కావడం లేదు. మేస్త్రీల కొరత ఉంది. నిర్మాణ కార్మికులు లభించడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం మేరకు గృహప్రవేశాలు కష్టమేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది.