సుస్థిరాభివృద్ధి లక్ష్య ప్రణాళిక అమలుకు చర్యలు
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్) సంబంధించి ప్రణాళిక అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్బాషా అధికారులకు సూచించారు.
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ రంజిత్బాషా
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్) సంబంధించి ప్రణాళిక అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్బాషా అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమీర్శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం అమరావతి నుంచి నిర్వహించిన వీసీకి హాజరైన కలెక్టర్ జిల్లాలో ఆయా అంశాల వారీగా ప్రగతిని వివరించారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ప్రత్యేక చొరవ చూపుతున్న సుస్థిర అభివృద్ధికి చెందిన 8 ప్రాధాన్య సూచికల్లో లక్ష్యాల సాధనకు అనుగుణంగా సమగ్ర సర్వే నిర్వహించాలని చెప్పారు.వైద్యారోగ్య శాఖలో అవసరమైన వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. టెలీ మెడిసిన్ విధానాన్ని పరిపూర్ణంగా అమలు చేయాలని, ఇంకా ప్రారంభం కాని హెల్త్ క్ల్లీనిక్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి డా.గీతాబాయి, డీఎల్డీవో సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, వైద్యాధికారిణి శర్మిష్ట, ఆర్ఐవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యలకు పరిష్కారం
జిల్లాలో శాశ్వత భూహక్కు పథకం ద్వారా భూ సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ రంజిత్బాషా రాష్ట్ర భూపరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్కు చెప్పారు. ఆయన అమరావతి నుంచి నిర్వహించిన వీసీకి హాజరైన కలెక్టర్ జిల్లాలో పురోగతిని వివరించారు.
వీధి దీపాలపై దృష్టి సారించండి
పంచాయతీల్లో వీధి దీపాల ఏర్పాటు విషయమై శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నిర్వహించిన వీసీకి హాజరైన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ పనిచేయని వీధి దీపాలను గుర్తించి ఎల్ఈడీ బల్పుల ఏర్పాటుకు పంచాయతీల వారీగా నివేదిక సిద్ధం చేయాలన్నారు. చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు పారిశుద్ధ్య సిబ్బందికి వేతన బకాయిలు లేకుండా చూడాలని చెప్పారు. డీపీవో నాగేశ్వరనాయక్, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, జడ్పీ సీఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రగతి వివరించిన కలెక్టర్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి నిర్వహించిన వీసీకి కలెక్టర్ రంజిత్బాషా, జేసీ అపరాజితసింగ్ హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఇతర ప్రాధాన్యత అంశాలకు సంబంధించి జిల్లాలో పురోగతిని ఆయనకు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM