logo

వాహనాలు ఢీకొని యువకులకు తీవ్ర గాయాలు

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన సంఘటన నందివాడలో గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

Published : 09 Dec 2022 05:57 IST

నందివాడ, న్యూస్‌టుడే: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన సంఘటన నందివాడలో గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన రక్ష కుమార్‌, వెన్ననపూడికి చెందిన అరవ ప్రేమ్‌కుమార్‌ బైక్‌లపై ప్రయాణిస్తూ నందివాడలో గ్యాస్‌ కంపెనీ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రక్షాకుమార్‌కు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ప్రేమ్‌కుమార్‌ అప్పటి వరకూ మాట్లాడుతూ ఆసుపత్రికి తరలిస్తుండగా అపస్మారక స్థితికి చేరుకున్నట్లు 108 సిబ్బంది తెలిపారు. వారిద్దర్నీ గుడివాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాత్రి 10గంటలకు కూడా నందివాడ పోలీస్‌ స్టేషన్‌కు ఇంకా సమాచారం అందకపోవడంతో ఎటువంటి కేసు నమోదు కాలేదని సిబ్బంది తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని