చేప పిల్లల మాటున బలప్రదర్శన
పట్టణ పరిధి ఫెర్రీలోని కృష్ణా నదిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల విడుదల కార్యక్రమం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బలప్రదర్శనకు వేదికగా మారింది.
మంత్రి, ఎమ్మెల్యేల విభేదాలు బహిర్గతం
ఫెర్రీ వద్ద చేప పిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తదితరులు
ఇబ్రహీంపట్నం, న్యూస్టుడే: పట్టణ పరిధి ఫెర్రీలోని కృష్ణా నదిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల విడుదల కార్యక్రమం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బలప్రదర్శనకు వేదికగా మారింది. కొన్ని రోజులుగా మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మధ్య విభేదాలున్నట్లు పలు వేదికలు, సమావేశాల్లో వారి అనుచరులు చేసిన ప్రకటనలు తేటతెల్లం చేసిన విషయం తెలిసిందే. దీనికి ఊతమిచ్చేలా స్వయంగా ఎమ్మెల్యే ఇటీవల తనకు ఇబ్రహీంపట్నంలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు మీడియా ఎదుట స్పష్టం చేశారు. మరోవైపు మూడు వారాలుగా ఇబ్రహీంపట్నంలో కొందరు అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలు, మీడియా ఎదుట పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో గురువారం చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అట్టహాసంగా నిర్వహించడం నియోజకవర్గంలో తన బలాన్ని నిరూపించడానికేనని స్పష్టమైంది. ఇబ్రహీంపట్నం రింగు సెంటర్ నుంచి ఫెర్రీ వరకూ 15 కార్లు, వందలాది ద్విచక్ర వాహనాలతో నియోజకవర్గ నలుమూల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భారీ ప్రదర్శన చేపట్టడానికి మంత్రి జోగి రమేష్ నూతన గృహం ఫెర్రీకి వెళ్లే రహదారి పక్కన ఉండటమేనని వసంత అభిమానులు అంటున్నారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మత్స్యకారులతో కలిసి 9 లక్షల చేప పిల్లలను ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో వదిలారు. తదుపరి ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులు పింఛన్ పొందేలా తమ ప్రభుత్వం అవకాశం కల్పించి భరోసా ఇచ్చిందన్నారు. ఆయన వెంట ఎంపీపీ జోత్స్న, పురపాలిక కౌన్సిలర్లు, అధిక సంఖ్యలో వైకాపా నాయకులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం