దక్కన్ బండి.. చూద్దాం రండి
మొదటి తరం అల్బియాన్ బస్సును బుధవారం పండిట్నెహ్రూ బస్టేషన్ సిటీ పోర్ట్లో ప్రదర్శనకు ఉంచారు. ఉద్యోగ విరమణ చేసిన ఆర్టీసీ డ్రైవర్లతో రిబ్బన్ కత్తిరించి బస్సును ఆవిష్కరించారు.
బస్సు ఆవిష్కరణలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు,
రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న
విజయవాడ బస్టేషన్, న్యూస్టుడే: మొదటి తరం అల్బియాన్ బస్సును బుధవారం పండిట్నెహ్రూ బస్టేషన్ సిటీ పోర్ట్లో ప్రదర్శనకు ఉంచారు. ఉద్యోగ విరమణ చేసిన ఆర్టీసీ డ్రైవర్లతో రిబ్బన్ కత్తిరించి బస్సును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పాల్గొని మాట్లాడుతూ బస్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులందరికీ కనిపించేలా దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న మాట్లాడుతూ తొలితరం బస్సును ఇప్పటి వారందరికీ తెలియజేసేలా ప్రదర్శనకు ఉంచడం అభినందనీయమన్నారు.
బస్సు చరిత్ర.. అల్బియాన్ కంపెనీ రూపొందించి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం 1932వ సంవత్సరంలో ప్రారంభించిన తొలి బస్సుకు పెట్టిన పేరు డెక్కన్ క్వీన్. అప్పటి రవాణా వ్యవస్థకు సాక్ష్యంగా నిలిచిన ఏకైక బస్సు ఇదే. ఇది నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా సంస్థ వారసత్వ ఆస్తి. ఆ సంస్థ 1932లో కేవలం 3 డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో ఏర్పడింది. దానిలో భాగంగా 27 అల్బియాన్ బస్సులను నిజాం రాష్ట్రంలో నడిపారు. లండన్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ బస్సులను 1970 వరకు హైదరాబాద్ ప్రాంత పరిధిలో తిప్పారు.
కాలినడకన వెళ్తున్న వారిని చూసి చలించిన యువరాణి... నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి నార్కట్పల్లి వరకు నడిచి వెళుతున్న ప్రజలను చూసి చలించిన యువరాణి జహీరా బేగం ఆలోచన మేరకు డెక్కన్ క్వీన్ బస్సులను ఏర్పాటు చేశారు. అప్పట్లోనే వీటికి రూ.3.71 లక్షలు వెచ్చించారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న అక్బర్ హైదరీ రాజు చొరవ తీసుకుని 27 బస్సులను లండన్లో కోనుగోలు చేసి అక్కడి నుంచి బొంబాయికి నౌకద్వారా, అనంతరం బొంబాయి నుంచి హైదరాబాద్కు రోడ్డు మార్గం ద్వారా 27 రోజుల్లో తీసుకు వచ్చి కాచిగూడ, నార్కట్పల్లి, కాజీపేట అనే 3 డిపోలను ఏర్పాటు చేసి అందజేశారు. మొదటి డెక్కన్ క్వీన్ బస్సును ఛార్మినార్ నుంచి రాణీగంజ్ మార్గంలో డిపారు. నిజాం యువరాణి సేవకు గుర్తుగా ఆమె పేరులోని మొదటి అక్షరం జడ్ను బస్సుల రిజిస్ట్రేన్లో చేర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్