కళ్లు మూసుకుంటాం.. మార్కులేసుకోండి
బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలను అత్యంత పక్కాగా నిర్వహించాల్సి ఉంటుంది. గురువులను తయారుచేసే ప్రక్రియలో ఇవి కీలకం.
ఇంటర్నల్ ఎగ్జామినర్లు, విద్యార్థులు లేకున్నా బీఈడీ ప్రాక్టికల్స్
ఈనాడు, అమరావతి
బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలను అత్యంత పక్కాగా నిర్వహించాల్సి ఉంటుంది. గురువులను తయారుచేసే ప్రక్రియలో ఇవి కీలకం. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్ ప్రాక్టికల్ పరీక్షల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ‘ప్రాక్టికల్ పరీక్షలను తూతూమంత్రంగా నిర్వహించుకోండి, ఇంటర్నల్ ఎగ్జామినర్లు లేకపోయినా, విద్యార్థులు రాకపోయినా.. మేం అస్సలు పట్టించుకోం, నచ్చినట్టుగా మార్కులు వేసేసుకోండి’ అనేలా విశ్వవిద్యాలయ అధికారులు వ్యవహరిస్తున్నారు.
కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో 22 బీఈడీ కళాశాలలుండగా.. వీటిలో ఒక్కో దానిలో చివరి ఏడాదిలో 50 మంది వరకూ విద్యార్థులున్నారు. ప్రస్తుతం ఆఖరి ఏడాది వారికి ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి విశ్వవిద్యాలయం కనీస ప్రణాళిక లేకుండా వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 21 నుంచి 25 వరకూ ఐదు రోజుల్లోనే పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ను ఖరారు చేశామంటూ.. కేవలం ఒక్క రోజు ముందు 20న కళాశాలలకు సమాచారం ఇచ్చారు. ఈ ఐదు రోజుల్లో ఆదివారం కూడా ఉంది. అంటే కేవలం నాలుగు రోజుల్లోనే గణితం, తెలుగు, ఆంగ్లం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం, జీవశాస్త్రం.. ఈ ఆరు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు పూర్తిచేయాలి. బీఈడీ కళాశాలల ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ అనేది.. అనుబంధంగా ఉండే పాఠశాలలపై ఆధారపడి ఉంటుంది. అలాంటిది.. కేవలం ఒక్క రోజులోనే షెడ్యూల్ను నిర్ణయించుకుని విశ్వవిద్యాలయానికి చెప్పడం, ఆ వెంటనే పరీక్షలను నిర్వహించడం అనేది చాలా కష్టం. పైగా ఒక్కో కళాశాలలో 40 నుంచి 50 మంది విద్యార్థులున్నారు. ఒక రోజుకు పది మందికి మించి ప్రాక్టికల్స్ పూర్తిచేయకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదు. చాలా కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకుండానే మార్కులు వేసేస్తుంటారు. వారికి మరింత ఊతం ఇచ్చేలా విశ్వవిద్యాలయం తీరు ఉంది. కనీసం ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా నియమించలేదు.
ఒకరికొకరు సహకరించుకునేలా..
గతంలో ప్రాక్టికల్ పరీక్షలను రెండు దశల్లో తేదీలు ఇచ్చి నిర్వహించేవాళ్లు. మొదటి దశలో కొన్ని కళాశాలల్లో పరీక్షలు నిర్వహించి.. వాటికి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లుగా మిగతా వాటికి సంబంధించిన అధ్యాపకులను వేసేవారు. తర్వాత మిగతా వాటికి నిర్వహించి.. మొదటి దశలో పూర్తయిన కళాశాలల అధ్యాపకులను ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లుగా వేసేవారు. కానీ.. ఈసారి అందరికీ ఒకేసారి.. కేవలం నాలుగు రోజుల్లో నిర్వహించుకోమంటూ షెడ్యూల్ను ఇచ్చారు. దీనివల్ల ఒక కళాశాల నుంచి మరో దానికి అధ్యాపకులు కుండమార్పిడి పద్ధతిలో ఎగ్జామినర్లుగా వెళుతున్నారు. మా వాళ్లకు మీరు మార్కులేయండి, మీ వాళ్లకు మేం వేస్తాం.. అని ఒప్పందం చేసుకునేలా ఈసారి విశ్వవిద్యాలయమే అవకాశమిచ్చింది. పైగా.. ఒక కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు జరిగితే.. కచ్చితంగా బయట నుంచి వచ్చిన అధ్యాపకుడు ఒకరు, కళాశాలకు చెందిన వారు మరొకరు ఎగ్జామినర్లుగా ఉండాలి. ప్రస్తుతం అన్ని కళాశాలలకు ఒకేసారి నిర్వహిస్తే.. ఇంటర్నల్ ఎగ్జామినర్లుగా ఆ విద్యా సంస్థకు చెందిన వాళ్లు ఉండేందుకు అవకాశం లేదు. దీంతో పరీక్షలు అస్తవ్యస్తంగా మారిపోయాయి.
దర్జాగా మార్కులు..
కృష్ణా వర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో చాలా వాటిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరారు. వారు తరగతులకు రారు. కేవలం హాజరు వేసి.. పరీక్షల సమయంలో వచ్చి వెళ్లిపోయేలా నిర్వాహకులు ఒప్పందం చేసుకుంటారు. ఒకరోజు ముందు మాత్రమే షెడ్యూల్ ఇవ్వడంతో వారిని రప్పించడం జరగని పని. ఇలాంటి విద్యార్థులందరి నుంచి అదనంగా వసూలు చేస్తున్నట్టు సమాచారం. వసూలు చేసిన దానిలో ఎగ్జామినర్లకు కొంత ఇచ్చి, విశ్వవిద్యాలయానికి కొంత చెల్లించి నచ్చినట్టుగా మార్కులు వేయించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ కళాశాలల్లో పేపర్ మీదే చాలామంది అధ్యాపకులుంటారు. వాళ్లు నిత్యం కళాశాలకు రారు. ప్రాక్టికల్ పరీక్షల సమయంలో మాత్రం రావాల్సి ఉంటుంది. ఈ సారి ఒక్క రోజు వ్యవధే ఇవ్వడంతో వాళ్లు రారనే విషయం విశ్వవిద్యాలయానికీ తెలుసు. ఇలా కీలకమైన తుది ప్రాక్టికల్ పరీక్షలను తూతూమంత్రంగా కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!