ఆలయాల పునరుద్ధరణ ఎప్పుడో?
కృష్ణా పుష్కరాలు, కనకదుర్గ పై వంతెన నిర్మాణం నేపథ్యంలో తొలగించిన తొమ్మిది ఆలయాల పునరుద్ధరణ పనులు రెండేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. రూ.1.79 కోట్లతో ఆలయాల నిర్మాణం చేపట్టారు.
గ్రౌండ్ ఫ్లోరుతో నిలిచిన శని ఆలయ నిర్మాణం
విద్యాధరపురం, న్యూస్టుడే: కృష్ణా పుష్కరాలు, కనకదుర్గ పై వంతెన నిర్మాణం నేపథ్యంలో తొలగించిన తొమ్మిది ఆలయాల పునరుద్ధరణ పనులు రెండేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. రూ.1.79 కోట్లతో ఆలయాల నిర్మాణం చేపట్టారు. అప్పటి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఏడాదిలోపు తొమ్మిది ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. వీటిల్లో శని ఆలయం, కనకదుర్గానగర్లోని శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణ పనులు శంకుస్థాపన చేసిన తరువాత ప్రారంభం కాలేదు. మిగిలిన ఏడు దేవాలయాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వీటిల్లో రూ.49 లక్షలతో పూర్తి చేసిన దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మవారి పాదాలు, బొడ్డు బొమ్మ గత ఆరు నెలలుగా ప్రారంభానికి నోచుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆయా ఆలయాల పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. చెత్త, దుమ్ము పేరుకుపోతోంది. మిగతావి ప్రారంభించారు.
దాతల సహకారంతో..
సీతమ్మవారి పాదాల సెంటరు వద్ద రూ.2 కోట్లతో నిర్మిస్తున్న శని ఆలయాన్ని దాత సహకారంతో పూర్తి చేయాలని నిర్ణయించారు. గ్రౌండ్ ఫ్లోర్ వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆలయ గోడల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. కనకదుర్గానగర్లోని దాసాంజనేయ స్వామి, శ్రీకృష్ణ మందిర పనులను ఇంత వరకు దేవాదాయ శాఖ ప్రారంభించలేదు. వీటి కోసం రూ.40లక్షలు కేటాయించారు. గోశాల నిర్వాహకులు మాత్రం దుర్గగుడితో సంబంధం లేకుండా రూ.15 లక్షలతో శ్రీకృష్ణుడి మందిరం, గో పూజకు అనుకూలంగా నిర్మాణం చేశారు.
ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రారంభిస్తాం
- అన్నపూర్ణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్
సీతమ్మ వారి పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం, బొడ్డు బొమ్మ ప్రారంభోత్సవ తేదీలను దేవాదాయ శాఖ కమిషనరు దృష్టికి తీసుకువచ్చిన తరువాత నిర్ణయిస్తాం. ఉత్తరాయణంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. శని ఆలయం దాతల సహకారంతో నిర్మిస్తున్నామన్నారు. రెండు నెలల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మిగిలిన ఆలయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటాం.
దుమ్ము కొట్టుకుపోతున్న సీతమ్మవారి పాదాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా, జనసేన ఎన్నికల ప్రచారం
[ 20-04-2024]
ఘంటసాల అంబేద్కర్ నగర్లో తెదేపా, జనసేన ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
[ 20-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. -
తెదేపా కార్యాలయం ప్రారంభం
[ 20-04-2024]
ఘంటసాల మండలం దాలిపర్రులో తెదేపా కార్యాలయంను అవనిగడ్డ నియోజకవర్గం జనసేన, తెదేపా, భాజపా ఉమ్మడి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. -
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
[ 20-04-2024]
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
[ 20-04-2024]
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. -
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
[ 20-04-2024]
మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం. -
మహా మాయగాళ్లు..!
[ 20-04-2024]
‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. -
పేర్నీ.. స్థాయి తెలుసుకొని మాట్లాడు
[ 20-04-2024]
అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. -
కృష్ణా డెల్టాపై కక్షగట్టి.. ఎండగట్టే యత్నం: ఎంపీ
[ 20-04-2024]
రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. -
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం
[ 20-04-2024]
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
కోతల జోగి.. చేతలు ఏవీ..?
[ 20-04-2024]
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. -
పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 20-04-2024]
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
[ 20-04-2024]
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
[ 20-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. -
బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి
[ 20-04-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. -
నాట్యప్రయోగిక పరీక్షలు
[ 20-04-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా
[ 20-04-2024]
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?