కల్యాణమస్తుకు ఆంక్షల ముడి
నందిగామలో పేద కుటుంబానికి చెందిన యువతికి వివాహమైంది. కల్యాణమస్తు పథకం సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకుందామని సచివాలయానికి వెళ్లారు.
కంచికచర్ల, న్యూస్టుడే: నందిగామలో పేద కుటుంబానికి చెందిన యువతికి వివాహమైంది. కల్యాణమస్తు పథకం సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకుందామని సచివాలయానికి వెళ్లారు. అక్కడ వధూవరుల కుటుంబాల బియ్యం కార్డుల నకళ్లు అడగ్గా.. వధువుకు మాత్రమే బియ్యం కార్డు ఉంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నందున వరుడికి లేదు. ఇద్దరికీ బియ్యం కార్డు ఉంటేనే పథకం వరిస్తుందని సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. కఠిన నిబంధనలతో తాజాగా అమలవుతున్న కల్యాణమస్తు పథకానికి ఎంతో మంది నూతన జంటలు అనర్హులవుతున్నారు.
నిబంధనలే అవరోధం
పేదల ఇంట్లో పెళ్లి చేయాలంటే ఆర్థిక భారంతో కూడిన వ్యవహారం. ఆ భారాన్ని తగ్గించేందుకు గత ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. వైకాపా అధికారం చేపట్టాక గత ఏడాది సెప్టెంబర్లో ఆ పథకానికి వైఎస్సాఆర్ కల్యాణమస్తు, షాదీ-తోఫాగా నామకరణం చేసి నిబంధనలు కఠినతరం చేశారు. కల్యాణమస్తుకు దరఖాస్తు చేసుకోవాలంటే పెళ్లి ధ్రువపత్రంతో పాటు మరో 13 ధ్రువ పత్రాలు జత జేయాలి. ఎన్టీఆర్ జిల్లాలో 605 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద గతేడాది అక్టోబర్ నుంచి జనవరి 13 వరకు డీఆర్డీఏ పీడీ లాగిన్కు కేవలం 51 దరఖాస్తులు మాత్రమే అందాయి. చాలా సచివాలయాలకు ఇప్పటిదాకా దరఖాస్తులే రాలేదు. గతేడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పథకం అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఉమ్మడి జిల్లాలో వేలల్లో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వారందరూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
నాడు పేదలైతే చాలు
గత ప్రభుత్వంలో తెల్లరేషన్ కార్డు ఉన్న వధువు తల్లిదండ్రులు దరఖాస్తు చేస్తే నగదు అందించేవారు. ప్రస్తుత ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టడంతో చాలా మంది పథకానికి దూరమవుతున్నారు. 2023లో ఏప్రిల్, జులై మినహా మిగిలిన నెలల్లో శుభ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణత, విద్యుత్తు వినియోగం తదితర నిబంధనలు లబ్ధికి అవరోధంగా మారాయి. ఆర్థిక స్థోమత లేక చదువుకోని పేద కుటుంబాల ఆడ పిల్లలకు పథకం అందని ద్రాక్షగా మారింది.
అర్హులందరికీ లబ్ధి
అర్హులందరికీ లబ్ధి అందుతుందని, జనవరి 31లోగా దరఖాస్తు చేస్తే ఫిబ్రవరిలో, ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసిన వారికి మేలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతుందని డీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
[ 29-03-2024]
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..