నాలుగేళ్లలో.. ఒక్కపునాది లేదు..!
సౌకర్యవంతంగా ఉన్న అన్నదాన భవనాన్ని.. కనీస ప్రణాళిక లేకుండా ఆరేళ్ల కిందట అప్పటి ఈవో కూలగొట్టేశారు. మళ్లీ అధునాతనంగా అన్నదాన భవనం కడతామని చెప్పారు.
దుర్గగుడి ఇంజినీరింగ్ విభాగం పనితీరుకు నిదర్శనం
ఈనాడు, అమరావతి
‘విజయవాడ దుర్గగుడిలో గత నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. కేవలం కాగితాలపై నమూనాలంటూ హడావుడి చేసి.. ఆలయ ఆదాయాన్ని కరిగించడం తప్ప చేస్తున్నదేమీ లేదు. ప్రతిసారీ ఏదో ఒక సంస్థను ఎంపిక చేశామని చెప్పి తీసుకురావడం, నమూనాలు గీయిస్తున్నామంటూ హడావుడి చేయడం.. వారికి రుసుములు చెల్లించడం.. కొంత తమ జేబుల్లో వేసుకోవడం.. గత నాలుగేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది.’
సౌకర్యవంతంగా ఉన్న అన్నదాన భవనాన్ని.. కనీస ప్రణాళిక లేకుండా ఆరేళ్ల కిందట అప్పటి ఈవో కూలగొట్టేశారు. మళ్లీ అధునాతనంగా అన్నదాన భవనం కడతామని చెప్పారు. పునాదులు కూడా ఇప్పటివరకూ కట్టింది లేదు. అన్నదాన స్థలాలను మారుస్తూ భక్తులను అవస్థలకు గురిచేశారు కొండపై ప్రసాదం పోటు భవనమూ నేలమట్టం చేశారు. ఆ తర్వాత కొండ దిగువన ఇళ్ల మధ్యలో ఉన్న వసంత మల్లికార్జున ఆలయం ప్రాంగణంలో రూ.కోటి ఖర్చుపెట్టి ఓ షెడ్డును తాత్కాలికంగా వేశారు. ఇప్పటికీ ప్రసాదం పోటు భవనానికి కూడా ఒక్క ఇటుకా పడలేదు. జమ్మిదొడ్డిలో ఉన్న ఇంద్రకీలాద్రి అతిథి గృహాన్ని కూడా తవ్వేశారు. గదులన్నింటినీ కొట్టేసి.. సూట్రూంలుగా మారుస్తున్నామని చెప్పారు. తీరా చూస్తే.. వాటిని ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల కార్యాలయాలుగా వాడుకుంటున్నారు. భక్తుల కోసం ఉన్న ఒకే ఒక్క కాటేజీని కూడా వారికి కాకుండా చేశారు. ఇవన్నీ ఆలయ ఇంజినీరింగ్ విభాగం, ఈవోల కార్యదక్షతకు ప్రత్యక్ష నిదర్శనాలే.
వేడుకల సమయంలో భారీగా వృథా ఖర్చు..
దసరా, భవానీదీక్షలు సహా దుర్గగుడిలో ఏటా నిర్వహించే వేడుకల సమయంలో మాత్రం ఇంజినీరింగ్ విభాగం అధికారులు అంచనాలు భారీగా తయారు చేస్తుంటారు. దసరా ఉత్సవాల నిర్వహణ ఖర్చును ఏటేటా పెంచుకుంటూపోయి.. ప్రస్తుతం రూ.కోట్లలో బిల్లులు చెల్లిస్తున్నారు. దసరా, భవానీదీక్షల సమయంలో ఇంద్రకీలాద్రి దిగువున ఉన్న వినాయక ఆలయం వద్ద నుంచి రెండు కిలోమీటర్లకు పైగా తాత్కాలిక క్యూలైన్లు వేస్తున్నారు. ఈ టెండర్లకే ఏటా రూ.కోట్లలో చెల్లిస్తున్నారు. ఏటా రెండుసార్లు ఖచ్చితంగా నిర్వహించే వేడుకలకు.. ఆలయం ఆధ్వర్యంలోనే సొంతంగా షామియానా సామగ్రి కొనుగోలు చేసుకుని ఉంచుకుంటే.. భారీగా ఖర్చు తగ్గుతుంది. వాటినే ఎన్నేళ్లయినా తాత్కాలిక క్యూలైన్లకు వినియోగించుకోవచ్చు. ఆ సామగ్రిని భద్రంగా ఒకచోట ఉంచేందుకు ఓ గది కట్టి.. దాని పర్యవేక్షణ బాధ్యతను ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది చూసుకోవచ్చు. కానీ.. ఏటా తాత్కాలిక పద్ధతిలో ఉత్సవాల ముందు క్యూలైన్లను వేసేందుకు టెండర్లు పిలుస్తున్నారు. ఈ టెండర్లు కూడా అధికారులు, ప్రజాప్రతినిధుల అనుయాయులకే ఇస్తున్నారనేది బహిరంగ రహస్యమే. కొంతమంది బినామీలను పెట్టి మరీ ఇలాంటివి దక్కించుకుంటున్నారు. ఆలయ ఆదాయాన్ని ఎలా కరిగించాలనే ప్రణాళికలే తప్ప.. ఆలయానికి మేలు చేసేవి ఒక్కటీ చేయడం లేదనే విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.
ఇంతమంది సిబ్బంది ఏం చేస్తున్నారో..
దుర్గగుడిలోని ఇంజినీరింగ్ విభాగంలో గత ఏడాది వరకూ ఒక ఈఈ పోస్టు మాత్రమే ఉండగా.. మరొకటి కొత్తగా సృష్టించారు. ప్రభుత్వం ఇస్తామన్న రూ.70 కోట్ల నిధులతో భారీగా భవనాల నిర్మాణం చేపట్టాలని చూపించి మరో పోస్టును మంజూరు చేయించారు. దీంతో ఆలయంలో ప్రస్తుతం ఇద్దరు ఈఈలున్నారు. డీఈలు ముగ్గురున్నారు. ఏఈలు తొమ్మిది మంది ఉన్నారు. వీళ్లుకాకుండా డ్రాఫ్ట్స్మన్, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫ్లంబర్లు సహా ఇతర ఉద్యోగులున్నారు. గత నాలుగైదేళ్లుగా ఆలయంలో ఒక్క భవన నిర్మాణం కట్టింది లేదు. 2016 తర్వాత నుంచి అన్నీ కూల్చేవే తప్ప.. నిలబెట్టేవే ఒక్కటీ లేవు. కేవలం చిన్న చిన్న మరమ్మతులు, గేట్లు మార్చడం, గోడలు కట్టడం.. ఇలాంటి వాటికే ఇంతమంది సిబ్బంది ఎందుకనేది అధికారులకే తెలియాలి. అప్హిల్ ఒకరు, డౌన్హిల్ ఒకరు అంటూ పనిని సృష్టించుకుని మరీ చాలామంది కాలయాపన చేస్తున్నారు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు