జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దుదాం
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకుంటూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ పి.రంజిత్బాషా అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం గణతంత్ర దినోత్సవం నిర్వహించారు.
గణతంత్ర దినోత్సవ సందేశంలో కలెక్టర్ రంజిత్ బాషా
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే
జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న కలెక్టర్, వందనం చేస్తున్న ఎస్పీ జాషువా
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకుంటూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ పి.రంజిత్బాషా అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన కలెక్టర్ జాతీయ జెండాను ఎగరవేశారు. జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు, జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక తదితరులు హాజరైన కార్యక్రమంలో ఆయన గణతంత్ర దినోత్సవ సందేశమిచ్చారు. జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు స్వాతంత్రోద్యమంలో అలుపెరగని పోరాటం చేశారని పేరుపేరునా కీర్తించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా వారిని స్మరించుకుంటున్నామన్నారు.
అలరించిన నృత్య ప్రదర్శన
రైతు సంక్షేమం కోసం చర్యలు
జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం ద్వారా నాలుగు విడతలుగా జిల్లాలోని రైతులకు రూ.553 కోట్లు అందజేశామన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 16,572 మంది రైతులకు రూ.121 కోట్ల బీమా చెల్లించామన్నారు. జిల్లాలో 22-ఎ నుంచి దాదాపు 24 వేల ఎకరాలు తొలగించి రమారమి 12,000 మంది రైతులకు వారి భూములపై సర్వహక్కులు కల్పించామన్నారు. శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా చేపట్టిన సమగ్ర రీసర్వేను 100 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 54 లక్షల పనిదినాలు కల్పించి రూ.131 కోట్లు వేతనాలుగా చెల్లించామన్నారు. జలకళ పథకం ద్వారా 248 బోర్వెల్స్ తవ్వించి రైతుల జీవనోపాధికి ఊతమిచ్చామన్నారు. ఉపాధి హామీ అనుసంధానంతో రూ.250 కోట్ల అంచనాలతో చేపట్టిన సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
పేద వర్గాలకు ఉచితంగా మెరుగైన విద్య, వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో నాడు-నేడు కార్యక్రమం ద్వారా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రూ.20.44 కోట్లతో ఆరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఆధునిక వైద్య వసతులు అభివృద్ధి చేస్తున్నామని, రెండో విడతగా రూ.181 కోట్లతో 490 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గత నాలుగేళ్లలో 90 వేల మందికి రూ.202 కోట్లు ఖర్చు చేశామన్నారు. 84,614 పక్కా గృహాలు మంజూరు చేశామన్నారు.
గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా గుర్తించి ప్రతిపాదించిన ప్రాధాన్య పనులు కొనసాగుతున్నాయన్నారు. జిల్లా మొత్తం మీద 591 పనులు మంజూరు చేయగా 543 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మచిలీపట్నంలో రూ.550 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వైద్య కళాశాల, 670 పడకల సామర్ధ్యం ఉండే ఆసుపత్రి, రూ.421 కోట్లతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మచిలీపట్నం వైద్య కళాశాలలో 150 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి దోహదపడే పోర్టు నిర్మాణానికి అన్ని అనుమతులు లభించాయన్నారు. పోర్టు పనులు త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ