రూ. 200 కోట్ల విలువైన మట్టి తరలింపు!
ఎకరా విస్తీర్ణం స్థలంలో 10 అడుగుల లోతులో తవ్వకాలు జరిపితే.. దాదాపు 15వేల నుంచి 18వేల వరకు ఘనపు మీటర్ల మట్టిని వెలికి తీసే అవకాశం ఉంది.
కొత్తూరు తాడేపల్లిలో వెలుగు చూస్తున్న నిజాలు
ఈనాడు, అమరావతి
ఎకరా విస్తీర్ణం స్థలంలో 10 అడుగుల లోతులో తవ్వకాలు జరిపితే.. దాదాపు 15వేల నుంచి 18వేల వరకు ఘనపు మీటర్ల మట్టిని వెలికి తీసే అవకాశం ఉంది. అంటే మూడు ఘనపు మీటర్లు ఒక యూనిట్ కింద లెక్క. ఎకరా స్థలంలో 10మీటర్లలోతు తవ్వితే.. సుమారు 1200 వరకు లారీల మట్టి వస్తుందని గనులు, భూగర్భ గనుల శాఖ అధికారుల లెక్క. కానీ అక్కడ కనీసం 20 నుంచి 30 అడుగుల లోతు తవ్వారు. 150 ఎకరాలకు పైగా తవ్వేశారు. రూ.కోట్లు కూడబెట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మండలం కొత్తూరు తాడేపల్లిలో గ్రావెల్, మట్టి తవ్వకాల తీరిది
విజయవాడ మండలం కొత్తూరు తాడేపల్లిలో గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధి పేరుతో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా గ్రావెల్, మట్టి తవ్వకాలు జరిపారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మరో కీలక ప్రజాప్రతినిధి అండదండలూ ఉన్నాయి. ఇక్కడి నుంచి తరలిస్తున్న 14 మట్టి లారీలను యాధృచ్ఛికంగా తాడేపల్లి ఎస్ఐ పట్టుకున్నారు. గనులు, భూగర్భ గనుల శాఖ అధికారులు తనిఖీ చేస్తే.. మరో 9లారీలు మట్టిని తరలిస్తూ పట్టుబడ్డాయి. నగరానికి అతిసమీపంలో కొన్ని వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తుంటే ఇంతకాలం అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు.. ప్రస్తుతం మొత్తం 23 లారీలకు జరిమానాలతో సరిపెట్టిన అధికారులు అక్రమ తవ్వకాలపై లెక్కలు తీసే పనిలో ఉన్నారు. ‘పెద్దల’ భాగస్వామ్యం ఉండటంతో ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగేనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తూరు తాడేపల్లి గ్రామం పరిధిలో రైతుల అనుమతితో కొన్ని, అనుమతి లేకుండా కొన్ని తవ్వకాలు జరిగాయి. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి అనధికార అనుమతులు ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం 20 మంది రైతుల నుంచి పొలాలు తీసుకున్నారు. మామిడి తోటలు సైతం తవ్వకాలు జరిగాయి. పోలవరం కట్ట కింది భాగంలోనూ తవ్వకాలు జరిగాయి. వివిధ ప్రాంతాల్లో కలిపి దాడదాపు 150 ఎకరాలకు పైగా తవ్వకాలు చేసినట్లు గుర్తించారు. వీటిని లెక్కతీయడానికి సమయం పడుతుందని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్క లారీ మట్టి రూ.10వేల చొప్పున కనీసం రూ.200 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయని అంచనా.
సూత్రధారులు తేలలేదు..!
తాడేపల్లిలో పట్టుకున్న 14 లారీలకు జరిమానా వేసి డ్రైవర్లకు తిరిగి అప్పగించారు. ఈ 14 లారీల యజమానులు ఎవరనేది గుర్తించే ప్రయత్నం చేయలేదు. పోలీసులు అసలు దర్యాప్తు జరపకుండా గనుల శాఖకు ఇచ్చి వదిలేశారు. ఓ ప్రజాప్రతినిధి సోదరుడి పేరుపై లారీ ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం 20 మంది వరకు రైతులను గుర్తించామని, వారికి నోటీసులు ఇవ్వనున్నామని అధికారులు చెబుతున్నారు. మట్టి తవ్వకాల ద్వారా ఎక్కడికి తరలించింది గుర్తించి సీనరేజీ వసూలుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా