విరిగిన బూట్లు.. చిరిగిన బ్యాగ్లు!
జగనన్న విద్యా కానుకలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. ఏడాదంతా విద్యార్థులకు ఉపయోగపడాల్సినవి ఐదు మాసాలకే అక్కరకు రాకుండా పోయాయి.
నందిగామ గ్రామీణం, న్యూస్టుడే
జగనన్న విద్యా కానుకలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. ఏడాదంతా విద్యార్థులకు ఉపయోగపడాల్సినవి ఐదు మాసాలకే అక్కరకు రాకుండా పోయాయి. విద్యార్థులు పాడైన బూట్లు, చిరిగిన బ్యాగులతో అవస్థలు పడుతున్నారు. ఏకరూప దుస్తులు విద్యార్థుల సైజుకు తగ్గట్టుగా లేకపోవడంతో వాటిని ధరించి వచ్చిన విద్యార్థులు తరగతి గదుల్లో ఇబ్బందిగా కూర్చుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం జగనన్న విద్యా కానుకలు (జేవీకే) 1,19,752 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఒక్కో విద్యార్థికి మూడు జతల దుస్తులు, బూట్లు, సాక్సులు, పుస్తకాల బ్యాగు, రాత పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒకటి, ఆరు తరగతులకు నిఘంటువులు ఇచ్చారు. పుస్తకాల బ్యాగులు చిన్నవిగా ఉన్నాయి. అందులో పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు పెట్టుకునేందుకు వీలు పడటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. బూట్లు కూడా నాసిరకంగా ఉండటంతో కాళ్ల వేళ్లు కనిపించేలా చిరిగాయి. కొంతమంది విద్యార్థులు గత ఏడాది ఇచ్చిన పాత బూట్లు, కొందరు చెప్పులు ధరించి పాఠశాలలకు హాజరవుతున్నారు. నాడు-నేడు నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న ప్రభుత్వం జేవీకే కిట్ల పంపిణీలో నాణ్యతను విస్మరించడంతో విద్యార్థులకు అవి ఇచ్చారన్న సంతోషం లేకుండా పోయింది. నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థినులు ప్రియంక, రిత్విక ఈ ఏడాది తమకు ఇచ్చిన బూట్లు విరిగి పోయాయని ఆందోళన చెందారు. విద్యాకానుకలో బూట్లు, పుస్తకాల బ్యాగులు నాణ్యమైనవి ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
జగనన్న విద్యాకానుకలు నాణ్యమైనవే ఇచ్చారు. బూట్లు నాణ్యతగా లేవు. ఈసారి మంచివి ఇచ్చేలా చూస్తామని సమగ్ర శిక్షా సీఎంవో ఎల్.వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ