ఇల్లు ఎలాగూ లేదు... కట్టిన డబ్బులూ ఇవ్వరా!
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉండే పేద ప్రజలకు పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో)కు చెందిన ఇళ్లను ఇస్తామంటూ రూ.38.33 కోట్లను కట్టించుకున్నారు.
నగరపాలక సంస్థ చుట్టూ తిరుగుతున్న టిడ్కో బాధిత లబ్ధిదారులు
ఈనాడు, అమరావతి
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉండే పేద ప్రజలకు పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో)కు చెందిన ఇళ్లను ఇస్తామంటూ రూ.38.33 కోట్లను కట్టించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు లబ్ధిదారులు కూడా కొంత చెల్లించాలని చెప్పి.. 11,917మంది నుంచి దఫదఫాలుగా ఈ డబ్బులు కట్టించుకున్నారు. నగరంలో అద్దె ఇళ్లలో ఉంటూ ఒక్కో రూపాయి కూడబెడుతూ.. 2018 నుంచి దశల వారీగా ఈ డబ్బులను పేదలు చెల్లించారు. డబ్బులు కట్టించుకున్న వారిలో కొందరికే ఇళ్లను ఇచ్చారు. చాలామందికి ఇప్పటికీ ఇవ్వలేదు. ఇళ్లను ఇస్తారనే నమ్మకమూ ప్రస్తుతం లేదు. కనీసం తాము కట్టిన డబ్బులనైనా తిరిగి ఇచ్చేయాలంటూ లబ్ధిదారులు నగరపాలక సంస్థ చుట్టూ గత రెండేళ్లుగా తిరుగుతున్నారు. కానీ.. వారు కట్టిన డబ్బులను ఇచ్చేందుకు కూడా ప్రాధాన్యతా క్రమం అని చెబుతూ.. కొందరికి మాత్రమే తిరిగిచ్చారు. ఇప్పటికే చాలాసార్లు తమ డబ్బుల కోసం బాధితులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనలు సైతం చేశారు. అయినా.. వారి డబ్బులను ఇవ్వకుండా తిప్పుతూనే ఉన్నారు. ఇప్పటికీ మరో రూ.7 కోట్లకు పైగా బాధిత లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది.
విజయవాడ నగరంలోని తూర్పు, పశ్చిమ, మధ్య మూడు నియోజకవర్గాల్లో ఉన్న పేద వారికి సొంతింటి కల సాకారం చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లను మంజూరు చేశారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. 300, 365, 430 చదరపు అడుగుల చొప్పున మూడు రకాల ఇళ్లను మంజూరు చేశారు. వీరిలో 300చ.అ ఇళ్లు వచ్చిన వారు రూ.500 చొప్పున కడితే సరిపోతుంది. 365చ.అ. ఇళ్ల కోసం రూ.50 వేలు చెల్లించాలి. 430చ.అ. ఇళ్లు మంజూరైన వాళ్లు మాత్రం రూ.లక్ష చెల్లించాలని చెప్పారు. ఇళ్ల కోసం అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.1.50లక్షలు, రాష్ట్రం రూ.2.40లక్షలు ఇస్తాయి. మిగతాది లబ్ధిదారులు చెల్లించాలి. బ్యాంకు రుణం కూడా కొంత తీసుకుని తర్వాత లబ్ధిదారులు దానిని కూడా చెల్లించుకోవాలని చెప్పారు. దీంతో నగరంలో తమ సొంతింటి కల సాకారం అవుతోందనే ఆనందం పేదల్లో కలిగింది. డబ్బులు అప్పులు చేసి తెచ్చి మరీ తమ వాటా కింద దఫదఫాలుగా చెల్లించారు. ఇలా డబ్బులు చెల్లించిన వారిలో కొందరికి ఇళ్లను మంజూరు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఇక అక్కడి నుంచి లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. అటు ఇళ్లు కేటాయించకుండా.. ఇటు డబ్బులూ తిరిగి ఇవ్వకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
నగరంలో 15,112 మందిని ఎంపిక చేసి..
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి 15,112 మందిని టిడ్కో ఇళ్ల కోసం ఎంపిక చేశారు. వీరిలో 11,917మంది రూ.38.33 కోట్లను తమ వాటా కింద చెల్లించారు. ఎక్కువగా 430చ.అ. ఇళ్ల కోసం డబ్బులు కట్టిన వాళ్లే ఉన్నారు. వీళ్లే 3790 మంది ఉన్నారు. ఒక్కొక్కరు రూ.50వేల నుంచి రూ.75 వేల వరకూ చెల్లించారు. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి మరీ తెచ్చి ఈ డబ్బులను చాలామంది కట్టారు. కానీ.. వీరిలో ఇప్పటివరకూ కేవలం 6,576మందికి మాత్రమే ఇళ్లు కేటాయించారు. మరో 5,341మందికి ఇళ్లను ఇవ్వలేదు. ఇళ్లు రాని వారు కట్టిన డబ్బులు రూ.17.18కోట్లు. ఇళ్లు ఎలాగూ ఇవ్వలేదు.. కనీసం తమ డబ్బులైనా వెనక్కి ఇచ్చేయమంటూ పలుమార్లు ఆందోళనలకు దిగారు. కానీ.. ఆ డబ్బులు నగరపాలక సంస్థ దగ్గర లేవు. వీళ్లు డబ్బులను వసూలు చేసి వాటిని టిడ్కోకు చెల్లించారు. బాధితుల ఒత్తిడి పెరగడంతో రూ.10 కోట్ల వరకూ టిడ్కో నుంచి మూడు దశల్లో తీసుకొచ్చి బాధితులకు ఇచ్చారు. మొదట చెల్లించిన వారి ప్రాధాన్యతా క్రమం ప్రకారం వీటిని వెనక్కి ఇచ్చారు. మిగతా.. రూ.7.18కోట్లను మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. కార్పొరేషన్ చుట్టూ వాటికోసం చక్కర్లు కొడుతున్నారు. టిడ్కో నుంచి తీసుకొచ్చి ఇస్తామంటూ అధికారులు చెబుతూ వస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM