logo

అంబులెన్స్‌లకు సుస్తీ..!

ఉమ్మడి కృష్ణాజిల్లాల్లోని మండలాల్లో తిరిగే 108 అంబులెన్స్‌లు మరమ్మతుల పేరుతో నిత్యం గొల్లపూడి మార్కెట్‌ యార్డుకు వస్తున్నాయి.

Published : 27 Jan 2023 03:54 IST

గొల్లపూడి మార్కెట్‌ యార్డులో మూలపడిన 108 వాహనాలు

ఈనాడు, అమరావతి: ఉమ్మడి కృష్ణాజిల్లాల్లోని మండలాల్లో తిరిగే 108 అంబులెన్స్‌లు మరమ్మతుల పేరుతో నిత్యం గొల్లపూడి మార్కెట్‌ యార్డుకు వస్తున్నాయి. బ్రేకు సమస్య, డోర్‌, దీపాలు, ఇంజిన్‌, టైర్ల సమస్యలతో వాహనాలు వస్తుంటే నిర్వహణ కోసమని 3 రోజులు ఇక్కడే ఆపేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి సామాన్లు ఇండెంట్‌ పెట్టి తెప్పించిన తర్వాత వీటికి బిగించి పంపడానికి ఆలస్యమవుతుండటంతో ఆయా మండలాల్లో అత్యవసర వైద్యసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. మరమ్మతు కాని వాటి నుంచి విడిభాగాలను తీసి ఇతర వాహనాలకు వేయడం వల్ల కొన్ని పనికిరాకుండా మూలపడి కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని