దేశభక్తి నింపిన ప్రదర్శనలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన అంశాలు ప్రతి ఒక్కరి మదిలో దేశభక్తిని నింపాయి.
భరతమాత, దేశ నాయకుల వేషధారణల్లో చిన్నారులు
మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే : గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన అంశాలు ప్రతి ఒక్కరి మదిలో దేశభక్తిని నింపాయి. జిల్లా పోలీస్పరేడ్ గ్రౌండ్స్లో గురువారం నిర్వహించిన వేడుకల్లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పోటీపడుతూ చేసిన సాంస్కృతిక అంశాలు గణతంత్ర వేడుకల ప్రాధాన్యాన్ని తెలియజేశాయి. మోపిదేవి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు హిందీ దేశభక్తి గేయాలకు లయబద్ధంగా నృత్యం చేస్తూ ఆహుతుల మన్ననలు అందుకున్నారు. పెడన భట్ట జ్ఞాన కోటయ్య హైస్కూల్ విద్యార్థులు జగతి సిగలో జాబిలమ్మకు వందనం.. మాతరం.. ఐ లవ్ ఇండియా అంటూ దేశభక్తి గేయానికి నృత్యం చేశారు. మోపిదేవి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు కొండకోన నడుమ మల్లెలు అన్న జానపద గేయానికి ఏకరూప వస్త్రధారణతో చేసిన ప్రదర్శన అలరించింది. మచిలీపట్నంలోని బాలాజీ విద్యాలయం విద్యార్థులు వందేమాతరం, ఇకె బాలభాను విద్యాలయం వారు ఇండియావాలే గేయాలకు ప్రదర్శన ఇచ్చారు. ఇకె బాలభాను పాఠశాల, పెడన భట్టజ్ఞాన కోటయ్య హైస్కూల్, మోపిదేవి రెసిడెన్షియల్ పాఠశాల ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు.
ఆకట్టుకున్న శకట ప్రదర్శనలు : గణతంత్ర దినోత్సవంలో భాగంగా మచిలీపట్నం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రకృతి విధానంలో సాగు చేసిన పంటలు, ఆర్బీకేలలో అందిస్తున్న సేవలతో శకటాన్ని తీర్చిదిద్దారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు.. అందిస్తున్న సేవలను తెలియజేసేలా తీర్చిదిద్దిన శకటం ఆకట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష శకటంలో జగనన్న అమ్మఒడి, నాడు-నేడు పనులు, జగనన్న విద్యాకానుక ద్వారా ఒకగూరిన వసతులు, విద్యార్థులు చదువుకుంటున్న తీరు తెలియజేసేలా శకటం తీర్చిదిద్దారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ శకటంలో డ్వామా ద్వారా అమలు చేస్తున్న పథకాలు తెలియజేసేలా తీర్చిదిద్దగా ఉపాధి పనుల్లో పాల్గొంటున్న వేతనదారులు కూడా శకటం వెనుక నడుస్తూ ప్రత్యేకతను చాటిచెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ, పాఠశాల విద్య శాఖ, సమగ్ర శిక్ష శకటం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) శకటాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి.
ఆకట్టుకున్న స్టాల్స్: వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ రంజిత్బాషా, జేసీ అపరాజితాసింగ్, ఎస్పీ జాషువా తదితరులు స్టాల్స్ను సందర్శించారు. పశుసంవర్థకశాఖ స్టాల్ ప్రథమ, స్త్రీ శిశుసంక్షేమశాఖ స్టాల్ ద్వితీయ, జిల్లా గ్రామీణాభివృద్ధి స్టాల్ తృతియ బహుమతులు సాధించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు