logo

కళా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన తార

కళా రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన నటి జమున అని ఏపీ ప్రజానాట్య మండలి అధ్యక్షుడు చంద్రానాయక్‌ అన్నారు. శనివారం విజయవాడ దాసరి భవన్‌లో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జమున సంస్మరణ సభ నిర్వహించారు.

Published : 29 Jan 2023 05:27 IST

జమున చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు చంద్రానాయక్‌, దుర్గారావు, కేవీ భాస్కరరావు, తదితరులు

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : కళా రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన నటి జమున అని ఏపీ ప్రజానాట్య మండలి అధ్యక్షుడు చంద్రానాయక్‌ అన్నారు. శనివారం విజయవాడ దాసరి భవన్‌లో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జమున సంస్మరణ సభ నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చంద్రానాయక్‌ మాట్లాడుతూ ఆమె ప్రజా నాట్యమండలి ద్వారా కూడా విభిన్నమైన పాత్రలు పోషించారని తెలిపారు. సామాజిక చైతన్యానికి పాటుపడ్డారన్నారు. సాధారణ కళాకారిణి నుంచి సినీ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి నాయకులు దుర్గారావు, కేవీ భాస్కరరావు, దోనేపూడి సూరిబాబు, టీవీ రాజు, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని