ఉగాది నాటికి పేదలకు టిడ్కో ఇళ్లు
ఉగాది రోజున గుడివాడలో పేదలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు.
రేఖా పటాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే కొడాలి నాని, గృహనిర్మాణ శాఖ డీఈఈ రామోజీ నాయక్
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: ఉగాది రోజున గుడివాడలో పేదలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. మల్లాయపాలెం జగనన్న లేఔట్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను కలెక్టర్ పి.రంజిత్ బాషాతో కలిసి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల పనులు ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేసి ఉగాది నాటికి పనులు పూర్తి చేసి టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సచించారు. లేఔట్లో బృహత్తర ప్రణాళిక ప్రకారం పనులు ఏమి జరిగాయి. ఇంకా ఏమి చేయాలనే అంశాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. జగనన్న కాలనీకి కూడా చుట్టూ తిరిగి వెళ్లకుండా దగ్గరలో ఉన్న దేవాదాయ శాఖ భూమిని సేకరించే అవకాశం ఉంటే దానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, గృహనిర్మాణ శాఖ డీఈ రామోజీ నాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని