logo

ఉగాది నాటికి పేదలకు టిడ్కో ఇళ్లు

ఉగాది రోజున గుడివాడలో పేదలకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు.

Published : 29 Jan 2023 05:27 IST

రేఖా పటాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎమ్మెల్యే కొడాలి నాని, గృహనిర్మాణ శాఖ డీఈఈ రామోజీ నాయక్‌

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఉగాది రోజున గుడివాడలో పేదలకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. మల్లాయపాలెం జగనన్న లేఔట్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషాతో కలిసి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల పనులు ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేసి ఉగాది నాటికి పనులు పూర్తి చేసి టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సచించారు. లేఔట్లో బృహత్తర ప్రణాళిక ప్రకారం పనులు ఏమి జరిగాయి. ఇంకా ఏమి చేయాలనే అంశాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. జగనన్న కాలనీకి కూడా చుట్టూ తిరిగి వెళ్లకుండా దగ్గరలో ఉన్న దేవాదాయ శాఖ భూమిని సేకరించే అవకాశం ఉంటే దానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, గృహనిర్మాణ శాఖ డీఈ రామోజీ నాయక్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని