మళ్లీ మొదలెట్టేశారు
నందివాడ మండలం పుట్టగుంటలోని ఆక్రమిత ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు మళ్లీ మట్టి తవ్వకాలను మళ్లీ మొదలెట్టేశారు. సుమారు రూ. 9 కోట్ల ఖరీదు చేసే ఈ భూమిని కొందరు ఆక్రమించి గతేడాది అక్రమంగా చేపల చెరువులుగా తవ్వారు.
పుట్టగుంటలో ఎమ్మెల్యే అనుచరుల మట్టి అక్రమ తవ్వకాలు
ఆక్రమిత ప్రభుత్వ భూమిలో మట్టితవ్వి టిప్పర్లతో తరలింపు
న్యూస్టుడే, నందివాడ: నందివాడ మండలం పుట్టగుంటలోని ఆక్రమిత ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు మళ్లీ మట్టి తవ్వకాలను మళ్లీ మొదలెట్టేశారు. సుమారు రూ. 9 కోట్ల ఖరీదు చేసే ఈ భూమిని కొందరు ఆక్రమించి గతేడాది అక్రమంగా చేపల చెరువులుగా తవ్వారు. ప్రభుత్వం నుంచి ఇబ్బంది రాకుండా ఎమ్మెల్యే అనుయాయులే అక్రమ చెరువు తవ్వకాలు జరిపించి టన్నుల కొద్ది మట్టిని టిప్పర్లతో ప్రైవేటు వెంచర్లకు తరలించి రూ. కోట్లలో సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో ఆక్రమిత భూములపై గ్రామస్థులు, సీపీఎం వారు సైతం ఆందోళన చేపట్టినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో భవిష్యత్తు భద్రతా దళం వ్యవస్థాపకుడు యలమంచిలి మురళీ కృష్ణ ప్రభుత్వ ఆక్రమిత భూములపై హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తున్పటికీ చెరువులను ఎండగట్టి వారం, పది రోజులుగా మళ్లీ టిప్పర్లతో పెద్దఎత్తున మట్టిని తవ్వి గుడివాడ, హనుమాన్ జంక్షన్ తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకోవడంతో ఆయన శనివారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
సీలింగ్ చట్టం కింద అగ్రహారం పెద్దల నుంచి స్వాధీనం? : అగ్రహారంలోని పెద్దల నుంచి సీలింగ చట్టం కింద ప్రభుత్వం సుమారు 15 ఎకరాలను పూర్వం స్వాధీనం చేసుకొని 60, 70 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు. బుడమేరు ముంపు ఎక్కువగా ఉండటంతో ఈ భూమిలో నాట్లు వేసింది లేదని, దశాబ్దాలుగా ఈ భూమి కాళీగా ఉండి తిరిగి ప్రభుత్వ పరమైందని అంటున్నారు. అయితే కొందరు అక్రమార్కులు అధికారులను లోబరచుకొని రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో అక్రమంగా పట్టాలు పుట్టించారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అధికార పార్టీ అండదండలతో అక్రమంగా చేపల చెరువులు తవ్వి కబ్జా బాగోతాన్ని శాశ్వతంగా కప్పిపెట్టేసే ప్రయత్నాలు మురళీకృష్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నిలిచిపోయాయి. ఆక్రమిత భూమిపై కలెక్టరు సమగ్రంగా నివేదిక ఇవ్వకపోవడంతో కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నట్లు ఆయన వివరించారు.
టిప్పర్లతో గుడివాడ, హనుమాన్ జంక్షన్వైపు ప్రైవేటు వెంచర్లకు తరలిపోతున్న మట్టి
మెరకకు నోచుకోని జగనన్న లేఔట్లు : మండలంలో 27 జగనన్న లేఔట్లు వేశారు. జనార్దనపురంలో 3 లేఔట్లు ఉంటే ఒక్కదానిలోనే ఇళ్లు మొదలెట్టారు. మిగిలిన అన్ని చోట్లా మెరక చేయకపోవడంతో వర్షాకాలంలో నీట మునుగుతున్నాయి. ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా పేదలు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారు. స్థలాలు ఇచ్చామని గొప్పలు చెబుతున్న పాలకులు వాటిని మెరక చేసేందుకు మట్టిలేదని చెబుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ భూముల్లో, బుడమేరు నుంచి టన్నులకొద్దీ మట్టిని ప్రైవేటు వెంచర్లకు తరలించి అక్రమాలకు పాల్పడం ఏమిటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి అక్రమంగా తవ్విన మట్టిని జగనన్న లేఔట్లకు తరలించి, ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ