logo

క్షతగాత్రులకు సాయం చేస్తే.. నగదు ప్రోత్సాహం

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యం అందేలా సాయం చేసిన వారికి రూ.5,000 నగదు ప్రోత్సాహం ఉంటుందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Published : 29 Jan 2023 05:27 IST

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ డిల్లీరావు

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యం అందేలా సాయం చేసిన వారికి రూ.5,000 నగదు ప్రోత్సాహం ఉంటుందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) రూపొందించిన ‘గుడ్‌ సమరిటన్‌’ ప్రచార పత్రాన్ని నగరంలోని కార్యాలయంలో శనివారం ఆయన ఆవిష్కరించారు. రహదారి ప్రమాదాల నివారణపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఎన్జీవో ప్రాంతీయ అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని