అమ్మ ప్రసాదం కొందరికే..
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ అన్నప్రసాదం భక్తులందరికీ దొరకడం లేదు. పరిమిత సంఖ్యలో మాత్రమే అన్నదానం చేస్తుండటంతో కొందరికే పరిమితమైంది.
పరిమితంగా అన్నదానం
తీరు మార్చుకోని దుర్గగుడి అధికారులు
ఇంద్రకీలాద్రి, న్యూస్టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ అన్నప్రసాదం భక్తులందరికీ దొరకడం లేదు. పరిమిత సంఖ్యలో మాత్రమే అన్నదానం చేస్తుండటంతో కొందరికే పరిమితమైంది. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి విరాళాలు ఇచ్చే భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నా అన్నదానం స్వీకరించే భక్తుల సంఖ్య మాత్రం పెరగడం లేదు.
మూడు దశాబ్దాల కిందట రూ.15 లక్షలతో దుర్గగుడిలో నిత్యాన్నదానాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి దాతలు విరాళాలు విరివిగా ఇవ్వడంతో ప్రస్తుతం రూ.94 కోట్లు ఉన్నాయి. దేవస్థానం నిబంధనల మేరకు దాతలు ఇచ్చిన విరాళాలపై ఎంత వడ్డీ వస్తుందో ఆ మొత్తంతో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయాలి. ఈ ప్రకారం ఇప్పుడు నిధులపై వచ్చే వడ్డీతో రోజుకు 6 వేల మందికి అన్నప్రసాదాన్ని పంపిణీ చేసే అవకాశం ఉంది.
* 2014 వరకు దేవస్థానం రోజుకు 3 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతున్నందున అన్నప్రసాదాన్ని 5 వేల మందికి అందించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు భక్తులకు అన్నదానం పంపిణీ చేసేవారు. భక్తుల సంఖ్య, దాతల విరాళాలు పెరుగుతున్నప్పటికీ దేవస్థానం అధికారులు గతంలో నిర్ణయించిన దానికంటే తక్కువగా కేవలం 3,500 మందికి కుదించారు. ఆలయ ఖర్చు తగ్గించినట్లు చూపడానికి పంపిణీ చేసే సమయాన్ని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కుదించారు. ఇటీవల 2.30 గంటకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం లేదని చెప్పిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు లేకపోవడంతో వందలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించలేకపోతున్నారు. శుక్ర, ఆదివారాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
లిఫ్టులో అన్నం, సాంబారు తరలిస్తున్న సిబ్బంది
పంపిణీకి ఆటంకాలు
దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు అనేక ఆటంకాలను కల్పిస్తున్నారు. అన్నదాన భవనం తొలగించి ఐదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిర్మాణం జరగలేదు. తాత్కాలిక షెడ్డు, శృంగేరి సత్రం కోసం దేవస్థానం రూ.2 కోట్లు ఖర్చుపెట్టింది. అధికారుల అనాలోచిత చర్యల కారణంగా ఐదేళ్లుగా శృంగేరి సత్రంలో అన్నప్రసాదం వండి వాటిని నిత్యం ప్రత్యేక వాహనంలో మల్లికార్జున మహామండపానికి తరలించడానికి రూ.లక్షల్లో వ్యయం చేస్తున్నారు. వాటిని లిఫ్టుల్లో తరలిస్తున్నారు. నడవలేని భక్తులు, వృద్ధులు మాత్రం లిఫ్టులో రాకుండా అన్నప్రసాదం స్వీకరించే అవకాశం లేకుండా చేశారు. మూడో అంతస్తులో క్యూలైను పెట్టి అన్నప్రసాదం స్వీకరించే భక్తులను నడిచి రావాలని నిబంధన పెట్టడంతో అధికశాతం భక్తులు ప్రసాదం స్వీకరించే అవకాశం లేకుండా పోయింది. దాతలు అన్నప్రసాదానికి విరాళాలు ఇస్తున్నందున ఆ దామాషాలో భక్తులకు పంపిణీ చేసేందుకు ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మతోడు.. అడ్డగోలేచూడు!
[ 28-03-2024]
‘‘విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన చుండూరు వెంకటరెడ్డి (సి.వి.రెడ్డి) ఛారిటీస్ స్థలం, భవనాలను అన్యాక్రాంతం చేసేలా అడుగులు పడుతున్నాయి. -
కోడ్ కొండెక్కి.. అక్రమంగా రోడ్డెక్కి
[ 28-03-2024]
కోడ్ వచ్చి.. 10 రోజులైనా కళ్లెం పడనేలేదు. టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రుళ్లు తవ్వుతూనే ఉన్నారు. అడిగితే తీవ్ర బెదిరింపులు. చిన్నాచితక నాయకులు ఆపినా.. బడా నేతలు తవ్వేస్తున్నారు. -
పశ్చిమ బరిలో సుజనా
[ 28-03-2024]
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. -
నిజం గెలవాలి.. రాష్ట్రం వెలగాలి
[ 28-03-2024]
నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం హనుమాన్జంక్షన్, బిళ్లనపల్లిలో పర్యటించారు. -
ప్రలోభాలు అరికట్టేందుకు ముమ్మర తనిఖీలు
[ 28-03-2024]
జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేసి మద్యం, నగదు, కానుకలను పట్టుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపడతామని ఎన్నికల అధికారి రాజబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలియజేశారు. -
పార్టీ కోసం పనిచేయాల్సిందే.. ఓటర్లను మభ్యపెట్టాల్సిందే!
[ 28-03-2024]
ప్రతి ఓటరు నాడి పసిగట్టి లోబర్చుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని వైకాపా నాయకులు వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. -
ఎర్రకట్ట విస్తరణ ఎప్పుడో?
[ 28-03-2024]
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంలో రహదార్లు మాత్రం విస్తరణకు నోచుకోలేదు. వందలాది వాహనాల రాకపోకలతో ఎర్రకట్ట ప్రమాదాలకు నెలవుగా మారింది. -
రైల్వే సరకు రవాణాలో రికార్డు ఆదాయం
[ 28-03-2024]
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సరకు రవాణాలో రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. -
అయిదేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులేవీ?
[ 28-03-2024]
రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
[ 28-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామీణ మండలం దామూలూరు శివారు పంట కాలువ 19న గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. -
సీఎం జగన్ ఎగ్గొట్టిన హామీలు 85% : నెట్టెం
[ 28-03-2024]
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన పార్టీనీ చిత్తుగా ఎందుకు ఓడించాలో చెప్పడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. -
బీమా సొమ్ము చెల్లించాలని తీర్పు
[ 28-03-2024]
బీమా సొమ్ము చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కమిషన్ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. -
అయిదుగురు బుక్ కీపర్లపై వేటు
[ 28-03-2024]
కృత్తివెన్ను మండలం నీలిపూడిలో ఈ నెల 25న వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయిదుగురు వెలుగు బుక్ కీపర్లను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
దుర్గగుడి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు
[ 28-03-2024]
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో 25 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించగా.. రూ.3,78,72,537 ఆదాయం వచ్చింది. -
కృష్ణా పూర్వ డీపీవో ఉద్యోగం నుంచి తొలగింపు
[ 28-03-2024]
కృష్ణా జిల్లా పూర్వ పంచాయతీ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్న సీహెచ్ సుబ్రహ్మణ్యంను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ..
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే