ఆకర్షించి.. అడ్డంగా దోపిడీ
‘విమానాశ్రయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇటీవల విజయవాడకు చెందిన 40 మంది యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారు.
విమానాశ్రయాల్లో ఉద్యోగాలంటూ మోసం
ఐదారేళ్లుగా మోసపోతున్న యువత
ఈనాడు, అమరావతి
‘విమానాశ్రయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇటీవల విజయవాడకు చెందిన 40 మంది యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. దీంతో వారంతా సూర్యారావుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా తాజాగా కేసు నమోదు చేసి దీనికి బాధ్యుడైన వ్యక్తిని అరెస్టు చేశారు. విమానాశ్రయాల్లో కార్గో మేనేజర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర రూ.50వేల నుంచి రూ.లక్షన్నర వరకూ వసూలు చేశారు. విమానాశ్రయాల్లో అత్యధిక జీతాలు వచ్చే ఉద్యోగాలున్నాయంటూ గాలం వేసి గత ఐదారేళ్లుగా విజయవాడ సహా చుట్టుపక్కల యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చింది లేదు. అయినా ఎప్పటికప్పుడు యువత కొత్తగా మోసపోతూనే ఉన్నారు.’
గతంలో ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి మోసం చేసేవారు. ప్రస్తుతం నగరంలో కేంద్రాలను సైతం తెరిచి యువతకు గాలం వేస్తున్నారు. ఇలాగే కొంతకాలం క్రితం విజయవాడకు చెందిన ఓ నిరుద్యోగ యువకుడి నుంచి ఏకంగా రూ.6లక్షలకు పైగా దోచుకున్నారు. ఇంజినీరింగ్ పూర్తయిన యువకుడిని పక్కాగా నమ్మించి మోసం చేశారు. ఆన్లైన్లో ఉద్యోగ ప్రకనట చూసి యువకుడు దరఖాస్తు చేసుకున్నాడు. మొదట ఫోన్ ఇంటర్వ్యూ అంటూ నమ్మించారు. ఎలాంటి అనుమానం రాకుండా ఇంటర్వ్యూ చేశారు. ప్యాకేజీ ఎంత కావాలని అడిగారు. యువకుడు ప్యాకేజీ ఎంతనేది చెప్పగానే ఆరంభంలో అంత రాదని, తర్వాత పెరుగుతుందని ఒప్పించారు. చివరికి మీరు ఎంపికయ్యారు. అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తామంటూ చెప్పారు. వారం తర్వాత నిజంగానే అపాయింట్మెంట్ లెటర్ను ఒక ఎయిర్లైన్స్ సంస్థ పేరుతో పంపించారు. ఆ తర్వాత ఫోన్ చేసి.. గన్నవరం విమానాశ్రయంలోని తమ కార్యాలయాన్ని పలానా తేదీ వెళ్లి ఉద్యోగంలో చేరమంటూ చెప్పారు. ఉద్యోగం వచ్చేసిందని పూర్తిగా నమ్మేసిన తర్వాత దోచుకోవడం ఆరంభిస్తారు.
పక్కా ప్రణాళికతో.. డబ్బులను ముందుగానే అడిగితే అనుమానం వచ్చి ఎవరూ ఇవ్వరని తెలిసి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగం వచ్చేసిందంటూ నమ్మించేందుకు అపాయింట్మెంట్ లెటర్ పంపించే వరకూ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నటిస్తారు. ఉద్యోగం వచ్చేసింది, తమ కష్టాలు తీరిపోయాయనే ఆనందంలో నిరుద్యోగులు ఉండగా.. అసలు దోపిడీ మొదలు పెడతారు. మీరు పలానా తేదికి ఉద్యోగంలో చేరే సమయానికి కనీసం మూడు నాలుగు జతల యూనీఫాం ఉండాలి. మీరు కుట్టించుకుంటారు కదా, లేదంటే మమ్మల్నే ఎయిర్లైన్స్ సంస్థ నుంచి పంపించమంటారా అని అడుగుతారు. అత్యధిక మంది యువత మీరే పంపించేయండి అంటూ కోరతారు. అయితే మీ కొలతలు పంపించండి అని నమ్మిస్తారు. పంపించాక దుస్తుల కోసం డబ్బులు ఇవ్వాలని చెబుతారు.
అప్పటికే పూర్తిగా నమ్మేసి ఉన్న యువత.. వారు అడిగిన మొత్తం పంపిస్తున్నారు. దాని తర్వాత రెండు మూడు రోజులకు.. మీకు ఐడీకార్డు, ప్రత్యేక డ్యూటీ కిట్ ఇవ్వాలి. దాని కోసం మీరు ముందుగా డబ్బులు పంపించాలని చెబుతారు. యూనీఫాం సహా అన్నింటికి సంబంధించిన ఫొటోలను వాట్సాప్లో పంపిస్తారు. ముందుగా ఎందుకు డబ్బులు కట్టాలని ఎవరైనా అడిగితే.. సంస్థ నిబంధనలు అలాగే ఉన్నాయ్, మీకు నచ్చితేనే పంపించండి.. లేదంటే మీరు ఇప్పటివరకూ కట్టిన డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తామని నమ్మకంగా చెబుతారు. దీంతో ఇక్కడే చాలా మంది నమ్మేస్తుంటారు. వారు అడిగిన మొత్తాలను దఫదఫాలుగా పంపిస్తారు. ఇలా వీలైనంత ఎక్కువ యువత నుంచి పిండుకుని చివరికి వారికి ఏ ఫోన్లో అందుబాటులోకి వచ్చారో ఆ నంబర్ను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు.
99% నకిలీ ప్రకటనలే..
గన్నవరం సహా దేశంలోని పలు విమానాశ్రయాలలో ఉద్యోగాలున్నాయంటూ ప్రముఖ వెబ్సైట్లలో ఆకర్షించే ప్రకటనలు ఇటీవల పెరిగిపోయాయి. విమానాశ్రయాల్లో స్వీపర్ల నుంచి టికెట్ కౌంటర్, స్టోర్ రూం, కార్గో మేనేజర్లు.. అంటూ రకరకాల ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తున్నారు. వీటిలో 99శాతం అన్నీ నకిలీవే. ఏదో ఒక ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ పేరుతోనే దర్జాగా ఈ ప్రకటనలు పెడుతున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేదు. మీ డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎలాంటి దరఖాస్తు రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఆ తర్వాత ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుందంటూ చూడగానే ఆకర్షించేలా ఈ ప్రకటనలు రూపొందిస్తున్నారు. అన్ని రకాల ఉద్యోగ సమాచారం అందించే ప్రముఖ వెబ్సైట్లలో వీటిని పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.