పొదుపు సొమ్ము పక్కదారి
మండలంలోని చోడవరం పోస్టాఫీసులో అవకతవకలు వెలుగు చూశాయి. పేద, మధ్య తరగతి ఖాతాదారులు కష్టపడి పొదుపు చేసిన రూ.లక్షలు మాయమయ్యాయి.
పాసు పుస్తకాల్లో నమోదైన వివరాలను పరిశీలిస్తున్న అధికారులు
చోడవరం(పెనమలూరు), న్యూస్టుడే: మండలంలోని చోడవరం పోస్టాఫీసులో అవకతవకలు వెలుగు చూశాయి. పేద, మధ్య తరగతి ఖాతాదారులు కష్టపడి పొదుపు చేసిన రూ.లక్షలు మాయమయ్యాయి. ఈ వ్యవహారంలో తపాలా మాస్టరు సన్యాసిరావు చేతివాటం చూపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖాతాదారులు చెల్లించిన మొత్తాలు పాసు పుస్తకాల్లో నమోదైనా ఆన్లైన్ ఖాతాలో నమోదు కాకపోవడం, గడువుతీరిన డిపాజిట్లకు చెల్లింపులు చేయకపోవడంతో పలువురు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తపాలా శాఖ సహాయ సూపరింటెండెంట్ ఎల్.దేవానంద్తోపాటు ఇతర అధికారులు సోమవారం చోడవరం వచ్చి విచారణ చేపట్టారు.
అన్ని ఖాతాలకూ విస్తరణ: సేవింగ్స్ ఖాతా, రికరింగ్ డిపాజిట్లు, సుకన్య, బీమా తదితర ఖాతాలకు ఖాతాదారులు చెల్లించిన డబ్బులు తపాలా శాఖకు జమ చేయలేదని సమాచారం. పాసు పుస్తకాల్లో శాఖ ముద్ర వేసి ఆ మొత్తాలను ఆన్లైన్లో నమోదు చేయలేదు. దీంతో గల్లంతయిన పొదుపు సొమ్ము ఎంతనేది ఉన్నతాధికారులు శోధిస్తున్నారు. పోస్టుమాస్టరు సన్యాసిరావును విధుల నుంచి తప్పించి వీరు విచారణ ఆరంభించారు.
ఆయన రూటే వేరు..: పోస్టుమాస్టరు సన్యాసిరావు ఉద్యోగం చోడవరంలో అయితే.. నిబంధనలకు విరుద్ధంగా ప్రసాదంపాడులో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తీరిక సమయాల్లోనే ఆయన కార్యాలయానికి వచ్చి కాలక్షేపం చేసేవారని పలువురు ఖాతాదారులు విచారణాధికారులకు ఫిర్యాదు చేశారు. తన పేరు సన్యాసిరావు కాగా.. ఖాతాదారులకు, గ్రామస్థులకు శీనయ్యగా ప్రచారం చేసుకొనేవారని వారు అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.
తామంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారమని, భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేసుకున్నామని, ఇక్కడ కూడా తమ సొమ్ముకు భద్రత లేకుంటే ఎలాగని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.25 లక్షలు మాయం..?
ఈ కార్యాలయంలో దాదాపు వెయ్యి ఖాతాలుండగా సోమవారం నాటికి 200 మంది పాసు పుస్తకాల్లో నమోదైన మొత్తాలను విచారణాధికారులు ఆన్లైన్ ఖాతాలతో సరిపోల్చారు. దీంతో రూ.5 లక్షల వరకూ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఈ మొత్తం రూ.25 లక్షలకు ఎగబాకే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు.
అవకతవకలు వాస్తవమే
దేవానంద్, విచారణాధికారి
చోడవరం తపాలా కార్యాలయంలో ఖాతాదారుల పొదుపు సొమ్ములో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఇప్పటి వరకు దాదాపు రూ.4.50 లక్షలు సొమ్ము ఆన్లైన్ ఖాతాల్లో జమ కాలేదు. ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఈ విచారణ మరో వారం జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!