చిత్ర వార్తలు
విజయవాడలో 1997-98 మధ్యకాలంలో దాదాపు రూ.17 లక్షలు వెచ్చించి నాటి వామపక్ష పాలకులు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 30 అడుగులకు పైగా ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహం నేడు నగర పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ధ్వంసమవుతోంది.
మహాత్మా.. మన్నించుమా..!
విజయవాడలో 1997-98 మధ్యకాలంలో దాదాపు రూ.17 లక్షలు వెచ్చించి నాటి వామపక్ష పాలకులు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 30 అడుగులకు పైగా ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహం నేడు నగర పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ధ్వంసమవుతోంది. రాజీవ్గాంధీ పార్కులో పిచ్చిమొక్కలు, పొదల్లో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అత్యంత దయనీయ స్థితిలో ఉంది. అన్నా హజారేతో పాలకులు ఆవిష్కరింపజేశారు.తర్వాత కనకదుర్గ పైవంతెన నిర్మాణానికి ఈ భారీ విగ్రహం అడ్డుగా ఉందని, తొలగించి రాజీవ్గాంధీ పార్కులో పడేశారు. దీనిని పునఃప్రతిష్ఠించాలని సీపీఎం పక్షం నుంచి కౌన్సిల్లో మూడు సార్లు ప్రతిపాదనలు పెట్టారు. ఫలితం లేకుండా పోయింది.
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే
పదవి ఆమెది.. పెత్తనం ఆయనది
ఎంపీపీ సీటులో కూర్చొని ఆదేశాలు జారీ చేస్తున్న ఆమె భర్త అచ్యుతరావు
మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉంటే పాలనలో భర్తలు లేదా కుటుంబ సభ్యుల జోక్యాన్ని అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుసార్లు స్పష్టం చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. వైకాపా నుంచి ఎన్నికైన ఎంపీపీ రాజులపాటి వాణి నెలలో రెండు మూడ్రోజులు మాత్రమే తమ సీట్లో కన్పిస్తారు. ఇక మిగిలిన రోజుల్లో ఆమె భర్త, మండల పరిషత్తు ప్రత్యేక ఆహ్వానితుడు(నామినేటెడ్ పదవి) రాజులపాటి అచ్యుతరావు ఎంపీపీ సీట్లో కూర్చొని అధికారులు, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. మహిళా ప్రజాప్రతినిధి స్థానంలో ఆమె భర్త పాలన సాగించటం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
పెడన, న్యూస్టుడే
సీఎం కాన్వాయ్లో తుప్పు పట్టిన వాహనం
సీఎం కాన్వాయ్ ముందు ఎస్కార్ట్గా వచ్చిన ట్రాఫిక్ సీఐ వాహనం
సీఎం కాన్వాయ్కి ముందు ఎస్కార్ట్గా ఉన్న ట్రాఫిక్ సి.ఐ. వాహనం పరిస్థితి చూడండి. పైకప్పు మొత్తం తుప్పు పట్టి చాలావరకు పట్టు వదిలేసింది. కొన్ని చోట్ల కన్నాలు పడ్డాయి. దానిని సీఎం ఎస్కార్ట్ వాహనంగా ట్రాఫిక్ పోలీసులు వాడుతున్నారు. సోమవారం తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్న సీఎం కాన్వాయ్కి ఎస్కార్ట్గా వచ్చి కేసరపల్లి దగ్గర ఆగిన ఆ వాహనాన్ని చూసిన స్థానికులు అవాక్కయ్యారు. అదే బండి సామాన్యుడిదైతే పోలీసులు ఎలా వ్యవహరిస్తారో తెలిసిందే కదా అని గుసగుసలాడుకున్నారు.
ఈనాడు, అమరావతి
మరుగన్నారు... మూసేశారు
బహిరంగ మలమూత్ర విసర్జన నిరోధంలో భాగంగా విజయవాడలో చాలాచోట్ల రహదారుల పక్కన ఇలా ప్రైవేటు సహకారంతో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. చాలాచోట్ల ప్రారంభించకుండానే వదిలేశారు. మరికొన్ని నీటి సదుపాయం, నిర్వాహణ లేకపోవడంతో దిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయి. వీటిలోపల సామగ్రి దొంగలపాలవ్వడం, వినియోగించడానికి వెళ్లిన ప్రజలకు నీటిసదుపాయం లేకపోవడంతో దుర్గందభరితంగా మారాయి. విచిత్రంగా అడ్డుగా ఇనుపగడ్డర్లు, ముళ్లకంపలు వేసి మూసేస్తున్నారు..!
ఈనాడు, అమరావతి
వాడుకున్నారు.. వదిలేశారు!
విజయవాడ ఐజీఎంసీ మైదానంలో జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలు నిర్వహించారు. 5 రోజులైనా.. మైదానాన్ని శుభ్రం చేయక పోవడంతో క్రీడాకారులు ఆడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మైదానం లోపల, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టుల వద్ద, వాకింగ్ ట్రాక్లో చెత్త గుట్టలుగా ఉంది. వాటి పక్కనే
ఆడుకోవాల్సి వస్తోంది. పైపులైన్ లీకేజీతో నడక దారిలో నీరంతా చేరి.. క్రీడాకారులు పరిగెత్తడానికి వీలు లేకుండా మారింది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి