సంక్షేమమా ఏదీ నీ చిరునామా..?
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వారి కోసం సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ పేరుకే పరిమితమైంది.
మట్టి ఖర్చుల్ని కూడా విదల్చని ప్రభుత్వం
రోడ్డున పడుతున్న భవన నిర్మాణ కార్మికులు
న్యూస్టుడే, గుడివాడ(నెహ్రూచౌక్)
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వారి కోసం సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ పేరుకే పరిమితమైంది. కార్మికుల సంక్షేమానికి ఇంతవరకు నిధులు విడుదల చేసిన పాపాన పోలేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక వైపు పనులు లేక.. మరో వైపు ప్రభుత్వం ఆదుకోక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నామని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పనులు లేక పొట్ట చేత పట్టుకొని ఇప్పటికే చాలా మంది వలస పోతున్నారని.. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత మంది అదే బాట పట్టాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
జాడ లేని చట్టం
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్మికుల సంక్షేమ నిధిని ప్రభుత్వం ఇతర పథకాలకు దారి మళ్లించడం సరికాదని తప్పు పడుతున్నాయి. కార్మిక శాఖ కార్యాలయంలో తీసుకున్న ప్రతి దరఖాస్తుకు కనీసం రశీదు ఇచ్చే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. తాపీ కార్మికులకు ఇంతవరకూ గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయలేదు. చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు నిధులు విడుదల చేయడం లేదు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోవడంతో ప్రభుత్వం కరవు భత్యం ఇస్తామని చెప్పి ఇంతవరకూ చెల్లించలేదు.
వందలాది క్లైయిమ్స్ పెండింగులో
జిల్లాలో చనిపోయిన కార్మికులకు సంబంధించిన దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగులో ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం దారుణమని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. నగర, పురపాలక సంఘాల్లో వసూలు చేసే పన్ను కూడా కార్మికుల సంక్షేమానికి వినియోగించడం లేదని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. గుడివాడలో 2019లో చనిపోయిన భవన నిర్మాణ కార్మికుడు ఎం.అశోక్ కుటుంబ సభ్యులు మట్టి ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకొని మూడేళ్లు కావస్తున్నా ఇంతవరకూ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని సీఐటీయూ నాయకులు విమర్శిస్తున్నారు.
వలస బాట తప్పదు
పెరిగిన ఇనుము, సిమెంటు ధరలు.. ఇసుక కొరత వలన భవన నిర్మాణ రంగం ఇప్పటికే కుదేలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ రంగానికి ఊతమిచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోకపోతే ఉపాధి కోసం వలస బాట పట్టక తప్పదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వం గాలికొదిలేసింది
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. తమకు ఎటువంటి పథకాలు అమలు చేయకూడదని మెమో నెం. 1214 విడుదల చేయడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం కనీసం చనిపోయిన వారి కుటుంబాలకు మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు.
రేపాని కొండ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రభుత్వం ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఉపాధి కోసం వలసబాట పట్టకు తప్పదు. మా నిధుల్ని కూడా దారి మళ్లించడం అన్యాయం. దీనిపై ప్రభుత్వం స్పందించాలి.
బండి శ్రీను, తాపీ మేస్త్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ