స్థలాన్ని స్వాధీనం చేసుకున్న సిద్ధార్థ అకాడమీ
విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో కబ్జాల పర్వం పతాక స్థాయికి చేరింది. భూముల విలువ రూ.కోట్లకు చేరడంతో నకిలీ డాక్యుమెంట్లు, తప్పుడు ధ్రువపత్రాలతో కబ్జారాయుళ్లు దందాలకు పాల్పడుతున్నారు.
పెనమలూరు, కానూరు, న్యూస్టుడే: విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో కబ్జాల పర్వం పతాక స్థాయికి చేరింది. భూముల విలువ రూ.కోట్లకు చేరడంతో నకిలీ డాక్యుమెంట్లు, తప్పుడు ధ్రువపత్రాలతో కబ్జారాయుళ్లు దందాలకు పాల్పడుతున్నారు. ఇందుకు తాడిగడప వందడుగుల రహదారిలో తాజాగా వెలుగు చూసిన ఈ వ్యవహారమే తార్కాణం. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల చెంతనే సిద్ధార్థ అకాడమీకి చెందిన రూ.కోట్ల విలువైన స్థలం పరులపరం కాగా.. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆ సంస్థవారు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
తాడిగడప 100 అడుగుల రోడ్డులోని కానూరు పరిధి సిద్ధార్థ అకాడమీకి రెండు వేల గజాల స్థలం ఉంది. ఇది బందరు రోడ్డుకు దగ్గరగా, వందడుగుల రహదారికి పక్కనే ఉండడంతో దీని విలువ రూ.కోట్లకు చేరింది. సంస్థ భవిష్యత్తు అవసరాలకు ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. కొన్నేళ్ల నుంచి ఇక్కడ పిచ్చిచెట్లు, కంపలు పెరిగిపోవడంతో ఈ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. ఈ క్రమంలో ఆ స్థలం తమదేనంటూ కబ్జాదారులు ఏకంగా బోర్డు కూడా ఏర్పాటు చేయడంతో అకాడమీ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. తమ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణగోడ నిర్మించుకోవడానికి సహకరించాలని కోరారు. దీని స్థల యాజమాన్యానికి సంబంధించిన దస్తావేజులు, లింక్ డాక్యుమెంట్లను పోలీసులకు చూపించారు. అనంతరం ఆక్రమణపాలైన స్థలాన్ని సిద్ధార్థ అకాడమీ ప్రతినిధులు వారం క్రితం తిరిగి స్వాధీనం చేసుకున్నారు. స్థలాన్ని శుభ్రపరిచి మెరక చేయించారు. ఈ స్థలాన్ని విద్యార్థులకు ఆటస్థలంగా తీర్చిదిద్దనున్నట్లు అకాడమీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ఆక్రమణదారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
రెవెన్యూ అధికారులకు పంపుతున్నాం
సిద్ధార్థ అకాడమీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు సంబంధిత వివరాలను, ఇరువర్గాలకు చెందిన డాక్యుమెంట్లను పరిశీలనకు రెవెన్యూ అధికారులకు పంపుతున్నాం. వారి నుంచి తగిన నిర్ణయం వచ్చిన అనంతరం తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
గోవిందరాజు, సీఐ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
[ 23-04-2024]
తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైకాపా నాయకులు -
పేరుకే ఆర్టీసీ గ్రూప్.. అంతా వైకాపా భజనే
[ 23-04-2024]
తాను ఆర్టీసీ జోనల్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వైకాపా నాయకురాలు తాతినేని పద్మావతి పార్టీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు, కార్యక్రమాలను పోస్టు చేస్తున్నారు. -
గెలుపు వాకిట పసుపు తోరణం
[ 23-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు మయం.. తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు..! నినాదాలతో హోరెత్తిన నియోజకవర్గాలు.. జై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు. -
పదిలో.. మళ్లీ పదకొండే
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కృష్ణా మళ్లీ 11వ స్థానానికే పరిమితమైంది. కృష్ణాలో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగైనా.. -
రూ.3వేలు పెంచి.. సంక్షేమం రద్దు చేసి
[ 23-04-2024]
ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటే దాన్ని మోసం అంటాము. కానీ సీఎం జగన్ దాన్ని సాయం అని చెప్పుకుంటూ ఊదరగొడుతున్నారు. -
బుద్ధప్రసాద్ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
‘కూటమి’ కోసం కదలిన కోలవెన్ను
[ 23-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, తెదేపా నాయకుడు తుమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి -
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా
[ 23-04-2024]
-
జీతాలు అందక.. జీవనం గడవక
[ 23-04-2024]
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. -
పదిలో అద్భుత ప్రతిభ
[ 23-04-2024]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభతో మెరిశారు. -
వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
[ 23-04-2024]
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. -
‘అరాచక పాలకులను సాగనంపాలి’
[ 23-04-2024]
అరాచక పాలకులను ప్రజలు సాగనంపాలని ఎన్డీయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
పేదింట విరిసిన విద్యాకుసుమాలు
[ 23-04-2024]
తల్లిదండ్రుల పేదరికం చిన్నారుల ప్రతిభకు ఆటంకం కాదు అని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు నిరూపించారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో మంచి ప్రతిభ చటారు. -
నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర
[ 23-04-2024]
వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -
28 మంది అభ్యర్థులు... 31 నామపత్రాలు
[ 23-04-2024]
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సోమవారం 28 మంది అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!