హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలు
హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. మచిలీపట్నానికి చెందిన మాదివాడ శివశంకర్ నిజాంపేట వాసి ఎన్.శ్రీనివాసరావు ఇంటికి 2016, సెప్టెంబరు 28న వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మచిలీపట్నం (గొడుగుపేట): హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. మచిలీపట్నానికి చెందిన మాదివాడ శివశంకర్ నిజాంపేట వాసి ఎన్.శ్రీనివాసరావు ఇంటికి 2016, సెప్టెంబరు 28న వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్పేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి డా.షేక్మహ్మద్ఫజలుల్లా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బోగిరెడ్డి వెంకన్నబాబు వాదనలు వినిపించారు. కాగా నిందితుడు ఇప్పటికే వేరే కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం