ఆదమరిస్తే.. ఆయువు తీస్తుంది..
2022, జులై 12న సత్యనారాయణపురం, భానునగర్లో విద్యుదాఘాతంతో వృద్ధ దంపతులు మృతి చెందారు. మోటార్ స్విచ్ఛ్ ఆన్ చేసిన వెంటనే ఒక్కసారిగా షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
విద్యుత్తు వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి
సూర్యారావుపేట, న్యూస్టుడే
ఒకే ప్లగ్ సాకెట్కు ఎక్కువ ఉపకరణాలు పెట్టడం ప్రమాదకరం
2022, జులై 12న సత్యనారాయణపురం, భానునగర్లో విద్యుదాఘాతంతో వృద్ధ దంపతులు మృతి చెందారు. మోటార్ స్విచ్ఛ్ ఆన్ చేసిన వెంటనే ఒక్కసారిగా షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
2023, ఫిబ్రవరి 2న సత్యనారాయణపురంలో.. ప్లాస్టిక్ బకెట్లో వాటర్ హీటర్ పెట్టి, దాన్ని తీసే క్రమంలో తండ్రీ కూతుళ్లు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలు తీవ్ర విషాదం నింపాయి.
ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. విద్యుత్తు ప్రాణాలు తీసేస్తుందనడానికి ఈ రెండు ఉదాహరణలే నిదర్శనం. పరికరాల వాడకంలో సరైన అవగాహన లేకపోయినా, భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా విద్యుత్తు షాక్ కొడుతుందని ఎస్ఈ ఎ.మురళీమోహన్ చెబుతున్నారు. గృహ, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకు సంబంధించిన వినియోగదారులు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇళ్లల్లో భద్రతా ప్రమాణాలు..
* ఇంటికి ఎర్తింగ్ ఇచ్చినపుడు కనీసం రెండు ఎర్త్ ఎలక్ట్రోడులు బిగించుకోవాలి.
* గ్రైండర్, ఏసీ, రిఫ్రిజిరేటర్లలో అసాధారణ శబ్దాలు వస్తుంటే వెంటనే నిపుణులతో పరీక్ష చేయించుకోవాలి.
* ఒకే ప్లగ్ పాయింట్ నుంచి లూజు వైర్లు, తాత్కాలికంగా అనేక పరికరాలను కలపకూడదు.
* ప్లగ్ తీసేటపుడు వైరును పట్టుకుని లాగరాదు.
* గృహ విద్యుత్తు ఉపకరణాలు వాడేటపుడు తయారీదారుడు నిర్ధేశించిన సామర్థ్యం ఉన్న మూడు పిన్నుల ప్లగ్ సాకెట్లనే వాడాలి. చాలా మంది సాధారణ మూడు పిన్నుల ప్లగ్కు ఏసీ లేదా గీజర్ను బిగిస్తారు. మూడు పిన్నుల ప్లగ్ కరిగిపోయి ప్రమాదాలు జరుగుతాయి.
* గృహ వినియోగదారులు విద్యుత్తు షాక్ తగలకుండా.. ఇళ్లల్లో 30 మిల్లీ యాంప్స్ సామర్థ్యం గల అత్యాధునిక ఆర్సీసీబీ (రెసిడ్యుయల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్) లేదా ఈఎల్సీబీ (ఎర్త్ లీకేజీ సర్క్యూట్ బ్రేకర్)లను విద్యుత్తు సరఫరా వలయంలో చట్టప్రకారం విధిగా వినియోగించాలి. ఇవి ఉంటే.. ఎవరికైనా విద్యుదాఘాతం జరిగితే వెంటనే సరఫరా నిలిచిపోతుంది. ప్రాణాపాయం తప్పుతుంది.
* ఏదైనా విద్యుత్తు పరికరం పనిచేయకపోతే.. దాన్ని సొంతంగా మరమ్మతులు చేయకుండా సరైన నిపుణులతో మరమ్మతులు చేయించాలి.
* ఎవరికైనా కళ్ల ముందు విద్యుదాఘాతానికి గురై ఉంటే.. అతనికి సాయం అందించే ప్రయత్నంలో బాధితుడిని చేతితో పట్టుకోవద్దు. ఇది చాలా ప్రమాదకరం. ఎండు కర్రతో విద్యుత్తు తీగల నుంచి బాధితుడిని తప్పించాలి.
* ప్రయాణించే వాహనాలపై ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు జారిపడితే.. వాటి నుంచి జాగ్రత్తగా దూరంగా వెళ్లాలి. రెండు కాళ్లు పక్క పక్కన పెట్టుకుని ఒకేసారి గెంతుతూ దూరంగా వెళ్లాలి.
వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల్లో ఇలా చేయాలి..
ఇలా స్విచ్లు విరిగిపోతే వెంటనే మార్చుకోవడం మంచిది
* కరెంట్కు సంబంధించిన ఏ పని చేసినా.. విధిగా చెప్పులు, చేతి తొడుగులు ధరించాలి.
* కాటన్ మిల్లుల్లో విద్యుత్తు ప్యానల్ బోర్డు, మోటార్లపై కాటన్ డస్ట్ పార్టికల్స్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* లూజు ఎర్త్ కనెక్షన్లు, లూజ్ వైరింగ్ లేకుండా పర్మినెంట్గా ఉండేలా చూసుకోవాలి.
* ట్రాన్స్ఫార్మర్ చుట్టూ 1.8 మీటర్ల ఎత్తులో కంచె ఏర్పాటు చేసి, దానికి తప్పనిసరిగా ఎర్తింగ్ ఇవ్వాలి. బయటి మనుషులు లోనికి వెళ్లకుండా గేటు ఏర్పాటు చేయాలి.
* అన్ని స్విచ్ బోర్డులు, ప్యానల్ బోర్డుల ముందు రబ్బరు మ్యాట్లు విధిగా ఏర్పాటు చేయాలి.
* స్విచ్ బోర్డులు చెక్కబోర్డుపై బిగించకూడదు. దానికి బదులుగా ఇండస్ట్రియల్ ప్యానెల్ బోర్డు ఉపయోగించాలి.
* ఎర్త్ గుంటల్లో బాగా తడి ఉండేలా చూసుకోవాలి.
* లైటింగ్, పవర్ సాకెట్లు, ఎర్త్కు ఐ.ఎస్.ఐ. గుర్తు ఉన్నవి లేదా ఎల్ఆప్ఎల్ఎస్ వైర్లు ఉపయోగించాలి.
* మోటార్లకు విడిగా రెండు ఎర్తింగ్ కనెక్షన్లు ఇవ్వాలి.
* 3 పిన్ల సాకెట్లో 3వ పిన్కు తప్పనిసరిగా ఎర్తింగ్ ఉండాలి.
* ఇండస్ట్రీ పరిసరాల్లో తాత్కాలిక వైరింగ్ తొలగించి, శాశ్వతమైన పీవీసీ పైపుల ద్వారా ఏర్పాటు చేయాలి.
* లైటింగ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో 30 మిల్లీ యాంప్స్ ఆర్సీసీబీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో 100 మిల్లీ యాంప్స్ ఆర్సీసీబీ, లిఫ్ట్లు, ఎస్కలేటర్లకు 300 మిల్లీ యాంప్స్ ఆర్సీసీసీ విధిగా వినియోగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయ రాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM