logo

విజయవాడకు చేరుకున్న సైకిల్‌ యాత్ర

మధ్య ప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా నాటారం గ్రామానికి చెందిన క్రీడాకారిణి ఆశా మాల్వియా.. మధ్యప్రదేశ్‌ నుంచి దిల్లీకి సైకిల్‌పై సంపూర్ణ భారత యాత్ర చేపట్టింది.

Published : 04 Feb 2023 03:27 IST

సైక్లిస్ట్‌ ఆశాతో జేసీ శ్రీవాస్‌ నుపుర్‌

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : మధ్య ప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా నాటారం గ్రామానికి చెందిన క్రీడాకారిణి ఆశా మాల్వియా.. మధ్యప్రదేశ్‌ నుంచి దిల్లీకి సైకిల్‌పై సంపూర్ణ భారత యాత్ర చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడకు చేరింది. నగరంలోని జాయింట్‌ కలెక్టర్‌ విడిది కార్యాలయానికి రాగా, ఆమెను జేసీ శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌ అభినందించారు. విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. మహిళా సాధికారిత సందేశ వ్యాప్తికి, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆశా చేపట్టిన యాత్ర మహిళలకు స్ఫూర్తి దాయకమన్నారు. ఈ యాత్ర 2022,  నవంబరు ఒకటో తేదీన ప్రారంభించగా.. ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో 8,545 కిలో మీటర్ల మేర ప్రయాణించినట్టు జేసీ వివరించారు. ఈమె పర్వాతారోహకురాలని కూడా తెలిపారు. నేపాల్‌-భూటాన్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులోని 20,500 అడుగుల ఎత్తైన బీసీ రాయ్‌ సహా పలు శిఖరాలను అధిరోహించారని చెప్పారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి ఒ.హేమచంద్ర, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి యు.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని