మాజీ సర్పంచి ఇంట్లో పేలుడు
బాపులపాడు మండలం రంగన్నగూడెం మాజీ సర్పంచి మైనేని గోపాలరావు నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది.
పేలుడు ధాటికి ధ్వంసమైన ఇంటి తలుపులు
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే: బాపులపాడు మండలం రంగన్నగూడెం మాజీ సర్పంచి మైనేని గోపాలరావు నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించి ఉన్న సమయంలో విద్యుత్తు దీపం వేయడం వలన ఈ పేలుడు జరిగినట్లుగా భావిస్తున్నారు. 25 సంవత్సరాలు గ్రామానికి సర్పంచిగా పనిచేసిన గోపాలరావు, భార్య మరణించడంతో ఒక్కరే ఆ ఇంట్లో నివసిస్తున్నారు. తెల్లవారుజామున నిద్రలేచిన ఆయన తేనీరు పెట్టుకునేందుకు సన్నాహాలు చేస్తుండగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఆయన గాయాలవ్వడంతో పాటు, ఇంట్లో సామగ్రి మొత్తం చెల్లాచెదురుగా పడిపోయింది. ఇంటి తలుపులు కూడా ధ్వంసమైపోయాయి. పక్క వాటాలో ఉంటున్న నాగరాజు అనే వ్యక్తి సకాలంలో స్పందించి గ్యాస్ సిలిండర్ని బయట పడేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన గోపాలరావుని చిన్నఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ, సర్పంచి కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ సభ్యుడు పుసులూరి లక్ష్మీనారాయణ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!