logo

దుర్గగుడి ఈవో భ్రమరాంబ బదిలీ?

దుర్గగుడి ఈవో భ్రమరాంబ బదిలీ ప్రయత్నాలు చేస్తున్నారని ఇంద్రకీలాద్రిపై ఉద్యోగుల మధ్య శనివారం ప్రచారం సాగింది.

Published : 05 Feb 2023 05:33 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గగుడి ఈవో భ్రమరాంబ బదిలీ ప్రయత్నాలు చేస్తున్నారని ఇంద్రకీలాద్రిపై ఉద్యోగుల మధ్య శనివారం ప్రచారం సాగింది. ఇటీవల ఆమె చేపట్టిన అంతర్గత బదిలీలు, పదోన్నతులు, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ఆమె సెలవులో వెళ్లడంతో బదిలీపై ప్రచారం సాగుతోంది. ఈవోగా భ్రమరాంబ రెండేళ్లపాటు తనదైన శైలిలో విధులు నిర్వర్తించారు. దీంతో దేవస్థానం ఉద్యోగులతోపాటు అర్చకులు, గుత్తేదారులు తమకు అనుకూలంగా ఉండే వారిని ఈవోగా తీసుకురావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.70కోట్ల పనులపై ప్రజాప్రతినిధులు దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఇద్దరు అధికారులు దుర్గగుడి ఈవోగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని