ఆదాయానికి అడ్డుపడుతున్నారు
దుగురి ప్రయోజనం కోసం అక్కరకు రావాల్సిన ఆదాయానికి స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మోకాలడ్డుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది.
నాలుగు దశాబ్దాలుగా అనామతు అద్దెలతో సరి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే
మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్
దుగురి ప్రయోజనం కోసం అక్కరకు రావాల్సిన ఆదాయానికి స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మోకాలడ్డుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. నెలకు రూ.లక్షల్లో ఆదాయాన్ని సమకూర్చాల్సిన మండల పరిషత్ కాంప్లెక్స్ అధికారిక పైరవీల మాటున కునారిల్లుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దీర్ఘ కాలంగా నామమాత్రపు అద్దెతో పాత గుత్తేదారులు కొనసాగుతున్నా పట్టించుకోవాల్సిన పాలనా యంత్రాంగం వారి పట్ల చూపిస్తున్న ఉదారత చర్చనీయాంశం అవుతోంది.
జిల్లా పరిషత్, మండల పరిషత్లకు చెందిన రూ.కోట్లలో విలువైన ఆస్తులు కొన్ని ప్రాంతాల్లో అన్యాక్రాంతం అయ్యాయన్న ఆరోపణలు ఏనాటి నుంచో విన్పిస్తూనే ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్సులు, ఫెర్రీల వంటివాటి ద్వారా సమకూరాల్సిన ఆదాయానికి కొన్ని చోట్ల రాజకీయ జోక్యాలతో గండి పడుతోంది.ప్రభుత్వాల పరంగా స్థానిక సంస్థలకు వచ్చే నిధులు క్రమేపీ తగ్గిపోతున్న నేపథ్యంలో ఆదాయ వనరులు పెంచుకునేలా దృష్టి సారించి మండలాల వారీ ఆస్తులు, ఆదాయ వనరుల వివరాలు సేకరించి వాటిని పటిష్ఠపరిచేలా గతంలో చర్యలు ప్రారంభించినా అవి మూన్నాళ్ల ముచ్చటే అయ్యాయి. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లిలో ఉన్న మండల పరిషత్ కాంప్లెక్స్లోని 18 దుకాణాల్లో కొన్ని నెలలుగా ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నా పట్టించుకునే వారే లేరు.
ఆది నుంచి అవకతవకలే
మండల కేంద్రమైన చల్లపల్లి నడిబొడ్డున అతి కీలకమైన ప్రాంతంలో పరిషత్ నిధులతో 1992 సంవత్సరంలో 18 దుకాణాలతో రాజీవ్గాంధీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. ఇందులోని దుకాణాలను నిబంధనల మేరకు బహిరంగ టెండరు విధానంలో కేటాయించాల్సి ఉన్నా అప్పట్లోనే స్థానికంగా పట్టున్న పెద్దలు చక్రం తిప్పి తమ అనుయూయులకు తక్కువ అద్దెకు దుకాణాలు దక్కేలా చేశారనే విమర్శలున్నాయి. అనంతరం ఐదేళ్లకు ఒకసారి టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా అందుకు భిన్నంగా పాతవారే సక్రమంగా అద్దెలు చెల్లించకుండా 2006 వరకూ దుకాణాలను స్వాధీనంలో ఉంచుకున్నారు. ఇది గమనించిన అప్పటి ఎంపీడీవో కోర్టు ఆదేశాల ద్వారా దుకాణదారులను ఖాళీ చేయించడంతో పాటు అద్దె బకాయిలు వసూలు చేయాలని ప్రయత్నం చేసినా పూర్తిగా సఫలీకృతం కాలేకపోయారు. నిబంధనల మేరకు ఐదేళ్ల కాలవ్యవధితో బహిరంగ వేలం నిర్వహించి దుకాణాలు కేటాయించారు. మళ్లీ 2011లో వేలం నిర్వహించాల్సి ఉన్నా ఇప్పటి వరకూ అతీగతీ లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో పరిమిత కాలవ్యవధితో ఒక దఫాకు 33 శాతం అద్దె పెంపుతో పాతవారిని కొనసాగించవచ్చన్న అంశాన్ని ఆసరా చేసుకుని టెండర్ల అంశాన్ని అటకెక్కించేశారు. ఇటీవల అధికారం చేపట్టిన నూతన పాలకవర్గం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అద్దెల వ్యవహారంపై దృష్టి సారించి తాజాగా టెండర్లు పిలివాలని నిర్ణయించింది. విషయం గ్రహించిన దుకాణాలను స్వాధీనంలో ఉంచుకున్న కొందరు తమకు తెలిసిన విద్యను ప్రదర్శిస్తూ పాలకవర్గంలోని కొందరు సభ్యులను ఆకట్టుకున్నారు. మెత్తపడిన వారు మళ్లీ 33 శాతం పెంపు ప్రతిపాదన తీసుకురావడంతో మండల పరిషత్ అధికారి వాస్తవాలను వారికి వివరించి టెండర్లు నిర్వహించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. దీంతో వారు నియోజకవర్గానికి చెందిన ఓ కీలక వ్యక్తిని ఆశ్రయించి ఆయన అభయం పొందడంతో టెండర్ల ప్రతిపాదన మరుగునపడే స్థితికి చేరుకుంది.
కదలిక వచ్చేనా...?
గతంలో దుకాణాలు పాడుకున్న వారిలో కొందరు ఇతరులకు సబ్లీజ్కు ఇచ్చారు. పరిషత్ అనుమతి లేకుండా కొన్ని నెలల క్రితం ఒక షెడ్ నిర్మించి వినియోగించుకుంటున్నారు. వాణిజ్య పరంగా కేంద్రబిందువుగా ఉండే ప్రాంతంలో మార్కెట్ ధర ప్రకారం 18 దుకాణాలకు నెలకు రూ.లక్షల్లో అద్దె వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సగటున ఒక్కో దుకాణానికి సగటున నెలకు రూ.2,000 కూడా రావడం లేదు. ఏటా రూ. లక్షల్లో పరిషత్ ఆదాయం కోల్పోవడంపై స్థానికుడైన మోహనకృష్ణ హైకోర్టును ఆశ్రయించడంతో నాలుగు నెలల వ్యవధిలో టెండర్లు నిర్వహించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ గత నెలలో కోర్టు ఆదేశించింది. ఏ మేరకు ఆ ఆదేశాలను అమలు చేస్తారో వేచిచూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు