logo

పేదలకు ఉచిత న్యాయ సహాయం

పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నందున వినియోగించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీఆర్‌ కృష్ణయ్య అన్నారు.

Published : 05 Feb 2023 05:33 IST

దస్త్రాలు పరిశీలిస్తున్న న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణయ్య

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నందున వినియోగించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీఆర్‌ కృష్ణయ్య అన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లీగల్‌ఎయిడ్‌క్లినిక్‌ను శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందకపోయినా, ఇతర సమస్యలు ఉన్నా న్యాయసేవాధికారసంస్థ దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఆసుపత్రి వైద్యులు రామచంద్రరావు, ప్యానల్‌ న్యాయవాది ఎస్‌.గోవర్థనమ్మ, పారాలీగల్‌ వాలంటీర్‌ శ్యాంకుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని