సహాయ ఆడిట్ అధికారి ఆత్మహత్య
సహాయ ఆడిట్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనమలూరు మండలం పోరంకి వసంత్నగర్లో ఆదివారం చోటుచేసుకుంది.
అంగీరసబాబు మృతదేహం
పెనమలూరు, న్యూస్టుడే: సహాయ ఆడిట్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనమలూరు మండలం పోరంకి వసంత్నగర్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిగురుపాటి అంగీరసబాబు(34) విజయవాడలోని ఆడిటర్ జనరల్ కార్యాలయంలో సహాయ అధికారిగా పని చేస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్లో పని చేసి కొంతకాలం క్రితం బదిలీపై విజయవాడ వచ్చారు. అప్పటి నుంచి అంగీరసబాబు పోరంకి వసంత్నగర్లోని అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇతనికి 2014లో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెంకు చెందిన అనూషతో వివాహం జరిగింది. వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది. ఆదివారం ఉదయం అతడు ఇంట్లోని ఓ గదిలో కిందపడి విగతజీవిగా ఉండటాన్ని భార్య అనూష గుర్తించి మామ సాంబశివరావుకు తెలుపగా ఆయన వెంటనే వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా.. మృతుడు బెల్టుతో ఉరివేసుకుని ఉన్నట్టు గుర్తించారు. కానీ బెల్టు తెగి కిందపడటంతో తలపగిలి చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్ కామెంట్కు నవ్వులే నవ్వులు
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్లో!
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!