పోలీసులకు చిక్కిన డ్రగ్స్ ముఠా
ఇప్పటివరకూ రైళ్లు, బస్సులు, బైకులు, దుస్తులు, కూరగాయల మాటున డ్రగ్స్ సరఫరా చేస్తుండడం చూశాం. మాదాపూర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులకు పట్టుబడ్డ ముఠా అదృశ్య విధానంలో డ్రగ్స్ చేరవేస్తోంది.
ఐదుగురి అరెస్టు.. 18 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ను చూపుతున్న డీసీపీ శ్రీనివాస్రావు, ఏసీపీ చంద్రశేఖర్, సీఐ నర్సింగ్రావు
ఈనాడు, హైదరాబాద్- న్యూస్టుడే, మూసాపేట: ఇప్పటివరకూ రైళ్లు, బస్సులు, బైకులు, దుస్తులు, కూరగాయల మాటున డ్రగ్స్ సరఫరా చేస్తుండడం చూశాం. మాదాపూర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులకు పట్టుబడ్డ ముఠా అదృశ్య విధానంలో డ్రగ్స్ చేరవేస్తోంది. ‘డెడ్ డ్రాప్’ పేరుతో కొత్త విధానానికి తెరలేపింది. డ్రగ్స్ సరఫరాదారు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాలుండవు. డ్రగ్స్ అవసరమైన వ్యక్తులు ఫోన్ సందేశం ద్వారా సరకు అడగ్గానే.. ఒక ప్రాంతం పేరు, సమయం చెబుతారు. వినియోగదారు చెప్పిన సమయానికి అక్కడికెళ్లి తీసుకోవాలి. డబ్బు ఆన్లైన్లో పంపించాలి. ఈ ముఠాలోని ఐదుగురిని మాదాపూర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారంతా పాతికేళ్లలోపు కుర్రాళ్లు కావడం గమనార్హం. రూ.లక్ష విలువైన ఎండీఎంఏ, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నాడు. సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ రియాజ్, అదనపు డీసీపీ నారాయణ, కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ టి.నర్సింగ్రావుతో కలిసి బాలానగర్ డీసీపీ టి.శ్రీనివాసరావు కూకట్పల్లి ఠాణాలో వివరాలు వెల్లడించారు.
చిన్నవయసులోనే మత్తు బానిసలు
ఏపీలోని విజయవాడకు చెందిన దాసరి హరికృష్ణ అలియాస్ హరి(21) గచ్చిబౌలిలో ఉంటూ చెఫ్గా పనిచేస్తున్నాడు. మాదకద్రవ్యాలకు బానిసగా మారిన ఇతను డ్రగ్స్ విక్రేతగా మారాడు. ఇతనితోపాటు ఇటీవల డిగ్రీ పూర్తిచేసిన గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నెమలికంటి పవన్కుమార్ అలియాస్ పవన్(24), కళాశాల విద్యార్థి జంగం కిరణ్తేజ్(20), అమర రఘునందన్ సాంబమూర్తి అలియాస్ రఘు(23), కాగ్నిజెంట్లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన సాయికుమార్(24) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రఘునందన్ గతంలో బెంగళూరులో ఉన్నప్పుడు నైజీరియా దేశానికి చెందిన డ్రగ్స్ సరఫరాదారు అలీ పరిచయం అయ్యాడు. ఇతని ద్వారా రఘు డ్రగ్స్ కొనుగోలు చేస్తాడు. రఘు హైదరాబాద్ వచ్చాక డ్రగ్స్ కోసం నైజీరియన్ను సంప్రదించగా అతడు ఓ మహిళ ఫోన్ నంబరు ఇచ్చాడు. ఆమె ద్వారా ఈ ముఠా డ్రగ్స్ కొనుగోలు చేస్తుంది. కూకట్పల్లి ఐడీఎల్ చెరువు బతుకమ్మ ఘాట్ వద్ద డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. 18 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.
ఎవరా అదృశ్య మహిళ?
డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఈ ఐదుగురు నిందితులకు ఒక మహిళ తరచూ సరకు అందిస్తున్నట్లు సమాచారం. యువకులు సరకు అవసరమైనప్పుడు మహిళ ఫోన్కు వాట్సాప్ సందేశం పంపిస్తారు. ఆ వెంటనే ఆమె ఎక్కడ ఏ ప్రాంతంలో డ్రగ్స్ ఉంచుతుందో చెబుతుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన ఫొటో కూడా పంపిస్తుంది. సరిగ్గా ఆమె చెప్పిన సమయానికి యువకులు ఆ నిర్మానుష్య ప్రదేశానికెళ్లి డ్రగ్స్ తీసుకోవాలి. ప్రత్యక్ష సంబంధాల్లేకుండా సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదృశ్య మహిళ వివరాలు పట్టుబడ్డవారి దగ్గరా లేవని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఆచూకీ లభిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు