గుట్కా.. పోలీసులు పట్టించుకోక..!
గుట్కా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించినా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
నగరానికి యథేచ్ఛగా సరఫరా
బహిరంగంగానే విక్రయాలు
విజయవాడ సిటీ, పటమట, న్యూస్టుడే
రామవరప్పాడులోని కిరాణా షాపులో
స్వాధీనం చేసుకున్న గుట్కా... (పాత చిత్రం)
గుట్కా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించినా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు అక్రమార్కులు మాఫియాను తలపించే విధంగా గుట్కా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. టీ స్టాళ్లు, కేఫ్లు, కిరాణా దుకాణాల్లో బహిరంగంగానే అమ్ముతున్నారు. గత ఏడాది రామవరప్పాడులో కిరాణా దుకాణంలో దాడులు చేసి రూ.లక్షన్నర విలువ చేసే సరకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగర వ్యాప్తంగా ఇలాంటి షాపులు చాలా ఉన్నా.. పోలీసులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
తనిఖీలకు వస్తున్నాం.. సర్దుకోండి
తమ స్టేషన్ పరిధిలో ఏ ప్రాంతాల్లో గుట్కా విక్రయిస్తున్నారో పోలీసుల దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2020లో సుమారు రూ.2 కోట్లు, 2021లో రూ.3 కోట్ల విలువ గల సరకు సీజ్ చేశారు. 2022లో ఆ మొత్తం ఏకంగా రూ.27,89,033కు తగ్గిపోయింది. ముందు ఏడాదితో పోలిస్తే అందులో 10 శాతం కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పోలీసులు వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. కేసులు మాత్రం నమోదు చేసి ఊరుకుంటున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసిన సందర్భంలో అడపా దడపా దాడులు చేస్తున్నారు. ఆ సమయాల్లోనూ స్టేషన్లో కింది స్థాయి సిబ్బంది సంబంధిత వ్యాపారులకు ముందుగానే సమాచారం అందిస్తున్నారు. దీంతో వారు అప్రమత్తమవుతున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా
ప్రధాన వ్యాపారులు వెలుగులోకి రాకుండా అంతా ఫోన్ల ద్వారానే తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆటోనగర్, భవానీపురం తదితర ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని తమ గుట్కా సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. ఇందుకోసం గోడౌన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరకు రప్పించి, ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఎక్కువగా రాత్రివేళల్లో గోడౌన్ల నుంచి తమ ఏజెంట్ల ద్వారా ద్విచక్ర వాహనాలపై గుట్టు చప్పుడు కాకుండా దుకాణాలకు చేరవేస్తున్నారు. ఆ సమయంలో వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా, ఉన్నా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుట్కా విక్రయాలపై అధిక ఆదాయం ఉండడంతో ఎప్పుడైనా ఒకసారి పట్టుబడినా, చిన్న కేసులతో బయటకు వచ్చి మళ్లీ యథావిధిగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా పోలీసులు వాటిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్